MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని మోడీ భేటీ.. భారత్‌కు ఆహ్వానం

పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని మోడీ భేటీ.. భారత్‌కు ఆహ్వానం

భారత ప్రధాని నరేంద్ర మోడీ వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు వారు ముఖాముఖిగా అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. పర్యావరణ మార్పులు, పేదరికం, ఇతర అంశాలపై వారు మాట్లాడుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రైవేటు లైబ్రరీలో వారు భేటీ అయినట్టు తెలిసింది. ప్రధాని మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉన్నారు.  

2 Min read
Author : pratap reddy
| Updated : Oct 30 2021, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
pm modi pope francis

pm modi pope francis

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు(శనివారం) కాథలిక్ క్రైస్తవుల మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ప్రైవేటు లైబ్రరీలో ముఖాముఖిగా భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాలు సమావేశం కావాల్సి ఉంది. కానీ, గంట వరకు వీరిరువురు చర్చలు జరిపారు. ఈ సమావేశం హృదయపూర్వకంగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. అనేక అంశాలపై పోప్ ఫ్రాన్సిస్‌తో మాట్లాడే అవకాశం దక్కిందని వివరించారు. భారత పర్యటనకు రావాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించినట్టు ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌లు ఉన్నారు. 

ఈ సమావేశంలో పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడం, పేదరికాన్ని నిర్మూలించడం వంటి అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. అనంతరం భారత్‌కు రావాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను ప్రధాని మోడీ కోరారు. చివరిసారిగా 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో పోప్ జాన్ పాల్ II భారత్ పర్యటించారు. మళ్లీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగుతున్న కాలంలో పోప్‌ను భారత్‌కు ఆహ్వానించడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
pm modi pope francis

pm modi pope francis

ఇటలీ ప్రధాని మేరియో డ్రాగి ఆహ్వానం మేరకు జీ20 సదస్సులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోమ్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.

రోమ్‌లో ప్రతినిధుల సమావేశానికి ముందే ప్రధాని మోడీ పోప్ ఫ్రాన్సిస్‌లు సమావేశమయ్యారు. అనంతరం, ప్రధాని మోడీ యూకేలోని గ్లాస్గోకు చేరనున్నారు. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు ఆయన సీవోపీ 26 సమావేశంలో పాల్గొననున్నారు.

ఇటలీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పలు సంస్థల ప్రతినిధులతోపాటు భారత ప్రవాసీలనూ కలిశారు. రోమ్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
 

34
pm modi pope francis

pm modi pope francis

పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశంపై విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా నిన్న మాట్లాడారు. పోప్ ఫ్రాన్సిస్‌తో మాట్లాడటానికి ప్రత్యేక అజెండా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రముఖులతో మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేక అజెండా ఉండకపోవడమే సంప్రదాయమని వివరించారు. ఆ ఆనవాయితీని గౌరవిస్తామని తెలిపారు. అంతర్జాతీయ అంశాలపై ఇరువురూ మాట్లాడతారని భావిస్తున్నట్టు వివరించారు.
 

44
pm modi pope francis

pm modi pope francis

శనివారం ముగ్గురు దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. ఇందులో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కూడా ఉన్నారు. ఆకాస్‌ కూటమితో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో సమావేశం కాబోతున్నారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు ఒప్పందాన్ని జలాంతర్గామిని ఆస్ట్రేలియా అర్థంతరంగా నిలిపేసింది. అమెరికా అణుజలాంతర్గామిని ఆఫర్ చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నది. దీనిపై అమెరికాపై ఫ్రాన్స్ మండిపడుతున్నది. చైనాను కౌంటర్ చేయడానికే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే అమెరికా ఆకస్ కూటమిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. ఇందులో భారత్‌కు చోటులేకపోవడం గమనార్హం.

About the Author

PR
pratap reddy
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image3
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved