MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Operation Sindoor : 30 మంది ఉగ్రవాదులు హతం

Operation Sindoor : 30 మంది ఉగ్రవాదులు హతం

పహల్గాం ఉగ్రదాడులకు భారత్ ప్రతీకాారం తీర్చుకుంది. పాకిస్థాన్ తో పాటు పివోకే లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా యుద్దవిమానాలు దాడులు చేసాయి. ఇందులో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే.. 

1 Min read
Arun Kumar P
Published : May 07 2025, 07:02 AM IST| Updated : May 07 2025, 07:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
India Pakistan

India Pakistan

Operation Sindoor : పాకిస్థాన్ పై భారత్ భీకర దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా వైమానిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.   

25
Operation Sindoor

Operation Sindoor

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్రవాదంపై యుద్దం ప్రకటించింది. పాక్ పెంచిపోషిస్తున్న ఉగ్రమూకల ఆటకట్టించేందుకు సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోనే ఉగ్రస్థావరాలను గుర్తించారు. వాటిపై ఇవాళ మెరుపుదాడులకు దిగి నేలమట్టం చేసారు.  

Related Articles

Related image1
Operation Sindhoor: పాకిస్తాన్ పై S-400 క్షిపణి ప్రయోగం
Related image2
Operation Sindhoor: ఆపరేషన్‌ సింధూర్‌ అంటే ఏమిటి? దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు!
35
Masood Azhar

Masood Azhar

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ నివాసం, జైషే మహమ్మద్ స్థావరాలపై కూడా భారత విమానాలు దాడులు చేసాయి. మొత్తం 9 స్థావరాలపై బాంబుల వర్షం కురిపించిన వాయుసేన 30 మంది తీవ్రవాదుల హతం చేసింది. మమరో 55 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. 

45
India-Pakistan

India-Pakistan

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని కోట్లి, ముజఫరాబాద్, పాక్  పంజాబ్ లోని బహవల్ పూర్ లో భారత వాయుసేన దాడిచేసింది. అలాగే మురిద్కే, గుల్ పూర్, భింబర్, చక్ అమ్రు, బాగ్, సియాల్ కోట్ ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. ఇందులో 30 మంది మరణించారు. 
 

55
Operation Sindoor

Operation Sindoor

ఆపరేషన్ సింధూర్ పై పాక్ కూడా స్పందించింది. భారత వాయుసేన దాడిలో కేవలం 8 మంది మరణించినట్లు పాక్ చెబుతోంది. తమ భూభాగంలోకి చొరబడి భారత్ దాడులు జరపడం యుద్దం చేయడమేనని పాకిస్థాన్ అంటోంది.  దీనిపై ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ హెచ్చరిస్తోంది. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
పాకిస్తాన్
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved