MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • CBI అధికారులుగా నటించి రూ.కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు.. డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం

CBI అధికారులుగా నటించి రూ.కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు.. డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం

Cyber Crime: రోజు రోజుకు టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మోసం చేయడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ముంబైలో జరిగిన ఓ సైబర్ స్కామ్ ఇప్పుడు దేశాన్నే కుదిపేస్తోంది.   

1 Min read
Author : Kavitha G
Published : Oct 16 2025, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సైబర్ స్కామ్
Image Credit : AI

సైబర్ స్కామ్

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఆశ చూపి ఒకరు… భయపెట్టి మరొకరు.. జనాలను దోచుకుంటూనే ఉన్నారు. గతంలో చదువులేని వారినే లక్ష్యంగా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు చదువుకున్నవాళ్లు, ఎంతో తెలివైన వారు కూడా వీరి వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఓ ఘటన దేశాన్నే కుదిపేస్తోంది.  

24
రూ.58 కోట్లు దోచుకున్న కేటుగాళ్లు
Image Credit : stockPhoto

రూ.58 కోట్లు దోచుకున్న కేటుగాళ్లు

ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త దగ్గర ఏకంగా 58 కోట్ల రూపాయలను దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి ఈ దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ కేసు ఇదేనని సమాచారం.

Related Articles

Related image1
Cough Syrup: చిన్న పిల్లలకు దగ్గు మందు ఎందుకు వాడకూడదు? వాడితే ఏమవుతుంది?
Related image2
Child Health Tips: చిన్న పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
34
ఏం జరిగిందంటే?
Image Credit : Freepik

ఏం జరిగిందంటే?

ముగ్గురు నిందితులు సీబీఐ, ఈడీ అధికారులుగా నటిస్తూ వ్యాపారవేత్తకు వీడియో కాల్స్ చేేసేవారు. మనీలాండరింగ్ నేరం కింద అతన్ని, అతని భార్యను డిజిటల్‌ అరెస్టు చేస్తామని బెదిరించారు. కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి.. మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు జరుగుతోందని బాధితుడిని నమ్మించి మోసం చేశారు. అంతేకాదు ప్రభుత్వ అధికారులమని చెప్పుకునేందుకు వీరు నకిలీ గుర్తింపు కార్డులను కూడా ఉపయోగించారు.

44
ఆగస్టు నుంచే..
Image Credit : Getty

ఆగస్టు నుంచే..

ఈ మోసగాళ్లు బాధితుడిని మొదట ఆగస్టులో సంప్రదించారు. అప్పటి నుంచి ఈ మోసం కొనసాగుతోంది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వ్యాపారవేత్తను డిజిటల్‌ అరెస్టు చేసి అతని ఆస్తి, డబ్బు మొత్తాన్ని జప్తు చేస్తామని బెదిరించడంతో నిందితులకు రూ. 58 కోట్ల వరకు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల ఒక్కొక్కరి వ్యక్తిగత ఖాతాల్లో రూ. 25 లక్షలు వరకు ఉన్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ముఠా పరిధి చాలా పెద్దదని.. దీని నెట్‌వర్క్ ఇతర దేశాల్లో కూడా విస్తరించి ఉండే అవకాశం ఉందని అభిప్రాయ వ్యక్తంచేశారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
పోలీసు భద్రత
మోసం
నేరాలు, మోసాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Recommended image2
Now Playing
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu
Recommended image3
LPG Crisis : హమ్మయ్యా.. హర్ముజ్ జలసంధిని దాటిన భారత నౌకలు
Related Stories
Recommended image1
Cough Syrup: చిన్న పిల్లలకు దగ్గు మందు ఎందుకు వాడకూడదు? వాడితే ఏమవుతుంది?
Recommended image2
Child Health Tips: చిన్న పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved