Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • National
  • లోక్‌సభలో ప్రధానికి దక్కే గౌరవమే తెలుగు నేతకు ... ముందు వరుసలో కూర్చునే ఆయనెవరో తెలుసా?

లోక్‌సభలో ప్రధానికి దక్కే గౌరవమే తెలుగు నేతకు ... ముందు వరుసలో కూర్చునే ఆయనెవరో తెలుసా?

18వ లోక్‌సభలో ఎంపీల సీట్ల కేటాయింపు పూర్తయింది. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖ నేతలకు ముందు వరుసలో స్థానం దక్కింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన దూరంలో సీట్లు కేటాయించారు.

Arun Kumar P | Updated : Dec 02 2024, 08:20 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
lok sabha session

lok sabha session

Lok Sabha: 18వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల సీట్ల కేటాయింపు పూర్తయింది. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో సహా అరడజను పార్టీల నేతలకు ముందు వరుసలో స్థానం దక్కింది. ప్రధాని మోదీతో పాటు ఎన్డీయే కూటమికి చెందిన ఐదుగురు ప్రముఖ నేతలకు, రాహుల్ గాంధీతో సహా ముగ్గురు ఇతర ఎంపీలకు ముందు వరుసలో సీట్లు కేటాయించారు. సోమవారం పార్లమెంట్ సెక్రటేరియట్ స్పీకర్ ఓం బిర్లా ఆమోదంతో సీటింగ్ అరేంజ్‌మెంట్ జాబితాను విడుదల చేసింది.

23
lok sabha session

lok sabha session

సమాన దూరంలో బీజేపీ, కాంగ్రెస్

లోక్‌సభ సెక్రటేరియట్ సీటింగ్ అరేంజ్‌మెంట్‌పై లేఖ విడుదల చేసింది. దీని ప్రకారం కాంగ్రెస్, బీజేపీలు సమాన దూరంలో ఉన్న సీట్లను ఎంచుకున్నాయి. అయితే, ఇండియా కూటమిలో భాగమైన టీఎంసీ మాత్రం కాంగ్రెస్‌కు దూరంగా కూర్చుంటుంది. ప్రధాని మోదీతో పాటు ముందు వరుసలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాస్వాన్   కూర్చుంటారు.

33
lok sabha session

lok sabha session

తెలుగు యువ నేతకు ముందువరుసలో సీటు

స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఎంపీల సీట్లను ఖరారు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షాకు ట్రెజరీ బెంచ్‌లో మొదటి మూడు సీట్లు కేటాయించినట్లు తెలిపింది. రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు 58, 59 సీట్లు కేటాయించారు. ఇవి కూడా ముందు వరుసలోనే ఉన్నాయి.

ఎన్డీయే కోటా నుంచి భారీ పరిశ్రమల శాఖ మంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నేత హెచ్.డి. కుమారస్వామి, జనతాదళ్ (యునైటెడ్) మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ (లల్లన్) సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత రామ్మోహన్ నాయుడు, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీలకు ముందు వరుసలో సీట్లు దక్కాయి.

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
భారతీయ జనతా పార్టీ
భారత దేశం
నరేంద్ర మోదీ
రాహుల్ గాంధీ
 
Recommended Stories
Top Stories