India Pakistan war: ఈ ఐదు మిస్సైళ్లు చాలు పాకిస్తాన్ పని పట్టడానికి
India Pakistan war: భారత్ బలమైన సైనికులకు తోడుగా దుర్భేద్యమైన అస్త్ర శక్తిని కగిలివుంది. శత్రుదేశాలను నిమిషాల్లో అంతం చేయగల ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకోబోయే ఐదు మిస్సైళ్లు చాలు పాకిస్తాన్ పనిపట్టడానికి. శత్రు దేశాలకు వణుకు పుట్టించే భారత్ వద్ద ఉన్న ఆ ఐదు క్షిపణులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Top 5 Indian missiles that can strike deep into Pakistan: భారతదేశం తాను కలిగి ఉన్న అత్యాధునిక క్షిపణుల శక్తిని తాజా ఆపరేషన్ సింధూర్ లో మరింత బలంగా ప్రదర్శించింది. బ్రహ్మోస్ నుండి అగ్ని వరకూ భారత రక్షణ వ్యవస్థలో కీలకంగా నిలిచిన ఈ ఐదు ప్రధాన క్షిపణులు శత్రుదేశాలపై తక్షణ, ఖచ్చితమైన ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి కొన్ని నిమిషాల్లో శత్రువు స్థావరాలను నేలమట్టం చేయగల సామర్థ్యంతో ఉన్నాయి. పాకిస్తాన్ పనిపట్టే 5 క్షిపణుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్రహ్మోస్ - సూపర్సోనిక్ గేమ్ ఛేంజర్
భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ప్రపంచంలోనే వేగవంతమైన క్రూయిజ్ మిస్సైల్. ఇది మాక్ 3 (శబ్ద వేగం కంటే మూడింతలు ఎక్కువ) కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించి, 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా తాకగలదు. ఇందులో ఉన్న టెక్నాలజీ వల్ల ఇది శత్రువు రక్షణ వ్యవస్థలను ఛేదించగలదు.
2. అగ్ని సిరీస్ - భారత దీర్ఘ శ్రేణి శక్తి మిస్సైల్
అగ్ని సిరీస్లోని అగ్ని-V అంతరిక్ష స్థాయి క్షిపణి. ఇది 5,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. ఈ క్షిపణులు సాధారణ లేదా అణు ఆయుధాలను మోయగల సామర్థ్యంతో ఉంటాయి.
3. ప్రలయ్ - తక్కువ సమయంలో దుమ్మురేపే మిస్సైల్
ప్రలయ్ అనేది శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్. ఇది 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను వేగంగా, ఖచ్చితంగా ముట్టడించగలదు. దీనిని మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించబడేలా రూపొందించారు.
4. నిర్భయ్ - రాడార్కి దొరక్కుండా దూసుకెళ్లే మిస్సైల్
నిర్భయ్ అనేది సబ్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. ఇది తక్కువ ఎత్తులో ఎగురుతూ, 1,000 కిలోమీటర్ల దూరాన్ని దాటి లక్ష్యాన్ని తాకగలదు. ఇది శత్రుదేశం లోతుల్లో తాకాలసిన లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది.
5. శౌర్య - హైపర్సోనిక్ మిస్సైల్
శౌర్య హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించే క్షిపణి. దీన్ని కెనిస్టర్ ద్వారా ప్రయోగించవచ్చు. ఇది 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలదు. దీనిని గుర్తించడం, తిప్పికొట్టడం చాలా కష్టమైన పని.
ఆపరేషన్ సింధూర్, తర్వాత జరిపిన దాడులతో ఈ క్షిపణుల యాక్టివేషన్ ద్వారా భారత్ తన రక్షణలో ఎంతగా సిద్ధంగా ఉందో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. శత్రుదేశాలపై తక్షణ ప్రతీకార చర్యల్లో ఈ ఆయుధాలు కీలక పాత్ర పోషించగలవని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.