MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • భార‌త్ మ‌రో ఘ‌న‌త‌.. ప్ర‌పంచంలో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ ఎక్కడుందో తెలుసా?

భార‌త్ మ‌రో ఘ‌న‌త‌.. ప్ర‌పంచంలో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ ఎక్కడుందో తెలుసా?

India Big milestone: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీకి కొత్త మెట్రో ప్రాజెక్టులు, నమో భారత్ చొరవ ప్రకటించిన తరువాత భార‌త్ మ‌రో అద్భుత‌మైన ఘ‌న‌త సాధించింది. ప్ర‌పంచంలో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ క‌లిగిన దేశాల్లో ముందుకు దూసుకొచ్చింది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 05 2025, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

India Big milestone: భార‌త మ‌రో ఘ‌న‌త సాధించింది. ప్ర‌భుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చ‌ర్య‌ల‌తో మ‌రింత ప్ర‌గ‌తితో దూసుకుపోతోంది. ప్ర‌పంచంలో అత్య‌ధిక మెంట్రో  నెట్‌వర్క్ క‌లిగిన దేశాల‌తో పోటీ ప‌డుతూ ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతం ఇండియా ప్రపంచంలో మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా మారింది.

భారతదేశంలో మెట్రో రైల్ నెట్‌వర్క్ 1000 కిలోమీటర్లకు చేరింది. ఈ పెద్ద నెట్‌వర్క్‌తో చైనాతో పాటు అమెరికా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను కలిగిన దేశంగా ఘ‌న‌త సాధించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
modi metro

modi metro

మెట్రో విస్త‌ర‌ణ‌లో ప్ర‌ధాని మోడీ ప్ర‌భుత్వ చొర‌వ‌ 

ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఢిల్లీ మెట్రో మ్యాజెంటా లైన్ విస్తరణను ప్రారంభించనున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ నుంచి ఢిల్లీ న్యూ అశోక్  న‌గ‌ర్ వ‌ర‌కు నిర్మించిన 13 కిలోమీటర్ల ఢిల్లీ-ఘజియాబాద్-మేరట్ నమో భారత్ కారిడార్‌ను కూడా ప్రారంభించనున్నారు.

గత 10 సంవత్సరాల్లో మెట్రో నెట్‌వర్క్ వృద్ధి

గత 10 సంవత్సరాలలో మెట్రో సేవలు అందిస్తున్న రాష్ట్రాల సంఖ్య ఐదు నుంచి 11కు పెరిగింది. అలాగే మెట్రో కనెక్టివిటీ అందిస్తున్న నగరాల సంఖ్య ఐదు నుంచి 23కు పెరిగింది.

35

నిత్యం ల‌క్ష‌ల మంది మెట్రో ప్ర‌యాణం

మెట్రో సేవ‌లు ఉప‌యోగించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు ప్రయాణీకులు ఈ  రవాణా కూడా అద్భుతంగా ఉజ‌యోగించుకుంటున్నారు. 2014లో 28 లక్షల నుంచి ఇప్పుడు కోట్లకు పెరిగింది. అంటే ఇది 2.5 రెట్లు పెరుగుదలని సూచిస్తుంది. అదేవిధంగా, మెట్రో రైళ్ళు ప్రయాణించే మొత్తం దూరం మూడు రెట్లు పెరిగి, 86,000 కిలోమీటర్ల నుంచి 2.75 లక్షల కిలోమీటర్లకు చేరింది.

ప్రధాని మోడీ ఈ ఘనతను సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు. "గత దశాబ్దంలో, మెట్రో కనెక్టివిటి ని పెంచేందుకు విశాలమైన పనులు సాగాయి.. దీని ద్వారా నగర రవాణాను బలోపేతం చేసి 'ఈజ్ ఆఫ్ లివింగ్' ను పెంచడం జరిగింది" అని ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు.

45

2002లో ప్రారంభ‌మైన భార‌త్ మెట్రో నెట్ వ‌ర్క్ 

2002లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఢిల్లీలో ఆధునిక మెట్రోను ప్రారంభించడంతో ప్రారంభమైన భారత మెట్రో నెట్‌వర్క్ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మైలురాయిని చేరుకుంది. ప్రధాని మోడీ నాయకత్వంలో ముఖ్యంగా 2014 నుండి  మెట్రో పరివర్తన, విస్తరణ గ‌ణ‌నీయంగా పెరిగింది. 

గత దశాబ్దంలో, మెట్రో నెట్‌వర్క్ మూడు రెట్లు పెరిగింది. మెట్రో సేవలు ఉన్న రాష్ట్రాల సంఖ్య ఐదు నుండి పదకొండుకి పెరిగింది, అయితే మెట్రో కనెక్టివిటీ నుండి ప్రయోజనం పొందుతున్న నగరాల సంఖ్య ఐదు నుండి 23కి పెరిగింది.

55

ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ 

సాహిబాబాద్-న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ కారిడార్‌లోని 13 కిలోమీటర్ల అదనపు ఢిల్లీ సెక్షన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. మెట్రో నెట్ వ‌ర్క్ లో భార‌త్ సాధించిన ఈ ఘ‌న‌త క్రమంలో ప్ర‌దాని మోడీ ఆదివారం ఉదయం సాహిబాబాద్ RRTS స్టేషన్ నుండి న్యూ అశోక్ నగర్ RRTS స్టేషన్ వరకు నమో భారత్ రైలులో ప్రయాణించనున్నారు.

ఈ రైడ్ ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ కారిడార్ 13 కిలోమీటర్ల విస్తరణను సూచిస్తుంది. 4,600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబడిన ఈ కారిడార్ ఢిల్లీ-మీరట్ మధ్య ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. లక్షలాది మందికి హై-స్పీడ్, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ మొదటి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్.. ఆయన అందుకునే జీతం ఎంతో తెలుసా?
Recommended image2
Now Playing
నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
Recommended image3
Now Playing
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved