MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

Prime Minister Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల (సెప్టెంబర్ 29, 30) గుజరాత్ పర్యటన సంద‌ర్భంగా రెండవ రోజు గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత రైలులో కూడా ప్రయాణించాడు. ఇది దేశంలో ప్రారంభించ‌బ‌డిన మూడవ వందే భారత్ రైలు. దీనిని నెక్స్ట్ జనరేషన్ రైలు అని పిలుస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గుజరాత్-మహారాష్ట్ర మధ్య నడుస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో వందే భారత్ రైలుకు చెందిన కొన్ని ఫోటోలను పంచుకుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 30 2022, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో వందే భారత్ రైలుకు చెందిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ..వందే భారత్ 2.0: గుజరాత్-మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొంది. గాంధీనగర్ స్టేషన్‌లో రైలును జెండా ఊపి ప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అందులో కలుపూర్ రైల్వే స్టేషన్ వ‌ర‌కు ప్రయాణించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యుత్తమ-విమాన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

వందేభారత్ రైలులో ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ చిన్నారులతో చాలా సంభాషించారు. ఈ సందర్భంగా పిల్లలను కూడా నవ్వించారు. వందే భారత్ రైలు ప్రారంభానికి ముందు, PMO ట్వీట్ లో "పీఎం నరేంద్ర మోడీ గాంధీనగర్ నుండి అహ్మదాబాద్ వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతున్నారు. ఈ ప్రయాణంలో రైల్వే కుటుంబాలకు చెందిన వారు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతతో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. 
 

310

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును దేశీయంగా అభివృద్ధి చేశారు. ఈ రైలు యాంటీ-కాల్షన్ సిస్టమ్- కవాచ్‌తో సహా అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. అన్ని తరగతులలో సీటింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లలో 180 డిగ్రీల రెసిప్రొకేటింగ్ సీట్ల అదనపు సౌకర్యం ఉంది. వందే భారత్‌లోని ప్రతి కోచ్‌లో 32-అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. ఇవి వినోదంతో పాటు ప్రయాణీకులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి.
 

410

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెమీ-హై స్పీడ్ రైలు. ఈ రైలు కంటే ముందు, ఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మధ్య మరో రెండు వందేభారత్ రైళ్లను నడుపుతున్నారు.
 

510

రైలు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడింది. రైలు బరువు 392 టన్నులు. అంటే, దాని తగ్గిన బరువు కారణంగా, ప్రయాణీకులు అధిక వేగంతో కూడా మరింత సౌకర్యవంతంగా ఉంటారు. వందే భారత్ రైలులో ఆటోమేటిక్ ఫైర్ సెన్సార్లు, CCTV కెమెరాలు, WiFi సౌకర్యంతో కూడిన ఆన్-డిమాండ్ కంటెంట్, మూడు గంటల బ్యాటరీ బ్యాకప్, GPS సిస్టమ్ వంటి సౌకర్యాలు అందించబడ్డాయి.
 

610

ఈ రైలు 52 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. రైలుకు ఆటోమేటిక్ గేటు ఉంది. విశాలమైన కిటికీలు ఉన్నాయి కాబట్టి బయట దృశ్యం స్ప‌ష్టం చూడ‌వ‌చ్చు. లగేజీకి సరిపడా స్థలం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో, లోకో పైలట్లు, రైలు గార్డులు ఒకరితో ఒకరు అలాగే ప్రయాణీకులతో సంభాషించగలుగుతారు.
 

710

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 1.37 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. దీని కింద 400 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను కలుపుతుంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు మూడు వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ ల‌ను ప్రారంభించారు. 
 

810

వచ్చే మూడేళ్లలో 400ల‌ తదుపరి తరం సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అప్పటి జనరల్ మేనేజర్ సుధాన్షు మణి సూచనల మేరకు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) దీనిని నిర్మించింది.
 

910

వందేభారత్ రైలులో ప్రయాణంలో పిల్లలు కూడా ప్రధానితో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, చిన్నారుల మధ్య చాలా చర్చలు జరిగాయి. 
 

1010

వందేభారత్ రైలులో ప్రయాణ సమయంలో ప్రధానితో పాటు కొందరు ప్రత్యేక ప్రయాణికులు ఉన్నారు. ఈ పర్యటనలో ప్రధాని అనేక అనుభవాలను పంచుకున్నారు. మహిళలతో ప్రధాని పలు అంశాలపై చర్చించారు.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Recommended image2
Now Playing
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
Recommended image3
Now Playing
ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved