MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మహాకుంభ్ 2025: సీఎం యోగి ప్రత్యేక సమీక్ష.. ఏర్పాట్లపై సాధువుల హర్షం

మహాకుంభ్ 2025: సీఎం యోగి ప్రత్యేక సమీక్ష.. ఏర్పాట్లపై సాధువుల హర్షం

Mahakumbh 2025: మహాకుంభ్ 2025 సన్నాహాలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంత్ సమాజ్‌తో స‌మావేశం నిర్వహించారు. సన్నాహకాలపై సాధువులు సంతృప్తి వ్యక్తం చేశారు. 

2 Min read
Mahesh Rajamoni
Published : Dec 08 2024, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Mahakumbh 2025ఫ: మహా కుంభమేళా దివ్యత్వం, ఘనత పూజ్య సాధువులదేననీ, ప్రభుత్వం, పరిపాలన కేవలం సహాయకులని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సనాతన సంస్కృతికి గౌరవం లభిస్తుంటే అది సాధువుల కృప వల్లనే సాధ్యమైందన్నారు. ఈసారి కూడా పూజ్య సాధువులు మేళా అధికారులకు మార్గదర్శకత్వం చేయాలని కోరారు.

24

శనివారం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మహా కుంభమేళా ప్రాంతంలో సాధు సమాజంతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో 13 అఖాడాల ప్రతినిధులు, ఖాక్-చౌక్, దండిబాడ, ఆచార్యబాడ పరంపరలకు చెందినవారు, తీర్థ పురోహితుల ప్రతినిధులు పాల్గొన్నారు. డిసెంబర్ 13న ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగరాజ్‌కు రానున్నారని, ఆయన సంగమ పూజ చేసి, స్వచ్ఛ, సురక్షిత కుంభమేళా కోసం వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సీఎం కోరారు. సాధు సమాజం ప్రధాని కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపింది.

34

కుంభమేళా ఏర్పాట్లపై సాధువులతో చర్చిస్తూ, ఈ ఏడాది గంగా నది నీరు ఆలస్యంగా తగ్గడంతో కొన్ని పనులు ఆలస్యమయ్యాయని, అయితే సాధువుల అన్ని అవసరాలు తీరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. కుంభమేళాకు వచ్చే ప్రతి భక్తుడికి పవిత్ర గంగా, యమునా నదుల దర్శనం కలిగేలా చూస్తామని, నదుల పరిశుభ్రతకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సాధువుల సహకారం కూడా అవసరమని అన్నారు. సాధువుల మార్గదర్శకత్వంలోనే సనాతన ధర్మం వృద్ధి చెందుతుందని, 2025 కుంభమేళాను 2019 కంటే ఘనంగా నిర్వహించాలని, ప్రధాని మార్గదర్శకత్వంలో ప్రపంచం మొత్తం అయోధ్య, వారణాసి, బృందావనాన్ని కొత్త రూపంలో చూస్తోందని అన్నారు.

44

సీఎం యోగీ సనాతన ధర్మ పరిరక్షకుడని, ఆయన నాయకత్వంలో సనాతన ధర్మం వెలుగులోకి వస్తోందని సాధువులు కొనియాడారు. కుంభమేళా గురించి సాధువులతో నేరుగా చర్చించి, సమస్యలు తెలుసుకుంటున్న మొదటి ముఖ్యమంత్రి యోగీ అని అన్నారు. 2025 కుంభమేళా గతంలో జరిగిన వాటికంటే ఘనంగా ఉంటుందని సాధువులు సంతృప్తి వ్యక్తం చేశారు. భూమి కేటాయింపు, శిబిరాల ఏర్పాటు, వ్య‌ర్థాల తొల‌గింపు, ట్రాఫిక్, పరిశుభ్రత, ఘాట్లకు పేర్లు, ఆర్థిక సహాయం వంటి అంశాలపై సాధువులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సీఎం యోగీ ఆధ్వర్యంలో జరిగే 2025 కుంభమేళా ప్రపంచానికి శాంతి సందేశాన్నిస్తుందని, దీనికి తమ సహకారం ఉంటుందని సాధువులు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Recommended image2
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Recommended image3
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved