- Home
- National
- Chilli Farming : మిరప మొక్కలు నాటారా..? ఈ టిప్స్ పాటిస్తే చాలు.. పూత, కాత ఇరగ్గాయడం ఖాయం
Chilli Farming : మిరప మొక్కలు నాటారా..? ఈ టిప్స్ పాటిస్తే చాలు.. పూత, కాత ఇరగ్గాయడం ఖాయం
మిరపపంట వేసినవారు ముఖ్యంగా పూత సమయంలో కంగారుపడిపోతారు. మరి పూత బాగా రావాలన్నా, రాలిపోకుండా ఉండాలన్నా కొన్ని చిట్కాలు పాాటిస్తే చాలు. అవేంటో ఇక్కడ చూద్దాం.

ఇంట్లోనే మిర్చి పండించే చిట్కాలు..
Agriculture : ఇటీవల మిర్చి ధర ఆకాశాన్ని అంటాయి... క్వింటాల్ కు రూ.50,000 వరకు ధర పలికింది. దీంతో చాలామంది రైతులు మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ధరాభారం నుండి బయటపడేందుకు మీరు పెరట్లోనో, కుండీల్లోనే మిరప సాగు చేస్తున్నారా..? అయితే మీరు ఆశించినట్లుగా పూత పూయడం లేదా కాయలు కాయడం లేదా? కంగారు పడకండి, దీనికో మార్గం ఉంది. కొన్ని విషయాలపై కాస్త శ్రద్ధ పెడితే చాలు... అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. మొక్క మొదట్లో తడి ఉండేలా చూసుకొండి
మిరప మొక్కకు రోజూ కనీసం 6 నుంచి 8 గంటల పాటు నేరుగా ఎండ తగలాలి. నీడలో పెరిగే మొక్కలు సరిగా పూయవు. మొక్క మొదట్లో తేమ ఉండాలి కానీ, నీరు నిలిచిపోకూడదు. మట్టి మరీ ఎక్కువగా ఎండిపోయినా పూలు రాలిపోతాయి. కాబట్టి మిరప మొక్క మొదళ్లలో ఎప్పుడూ తేమ ఉండేలా చూసుకోవాలి.
2. ఎముకల పొడి వేయండి
మొక్కలు పూయడానికి నైట్రోజన్ కంటే ఫాస్పరస్, పొటాషియం ఎక్కువగా అవసరం. ఎముకల పొడి, బూడిద వంటివి మొక్క మొదట్లో వేస్తే పూత బాగా వస్తుంది. వారానికి ఒకసారి సూడోమోనాస్ ద్రావణాన్ని పిచికారీ చేస్తే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.
3. గంజి నీటిని పోయండి..
పులియబెట్టిన గంజి నీటిని మూడు రెట్ల నీటితో కలిపి మొక్క మొదట్లో పోయడం మంచిది. ఇది మొక్కకు బలాన్నిస్తుంది. మొక్క బాగా పెరిగాక నీళ్లు పోయడం కొద్దిగా తగ్గిస్తే, అది పూత పూయడానికి ప్రేరేపిస్తుంది. పూలు రాలకుండా ఉండటానికి, చిన్న ఇంగువ ముక్కను నీటిలో కలిపి పిచికారీ చేయడం ఒక పాత చిట్కా.
4. వేరుశనగ పిండి వేయండి..
వేరుశనగ పిండి, ఆవు పేడను నీటిలో కలిపి పులియబెట్టి, ఆనీటిని మొక్కకు పోస్తే తక్షణ శక్తి వస్తుంది. ఆకుముడత పురుగులు, తెల్లదోమ ఉన్నాయేమో గమనించాలి. వేపనూనె-సబ్బు మిశ్రమంతో వాటిని నియంత్రించవచ్చు. మొక్క అడుగు ఎత్తు పెరిగాక, చిగురును కత్తిరిస్తే ఎక్కువ కొమ్మలు వచ్చి, పూత బాగా వస్తుంది.

