బకెట్ నీళ్లలో పడి 11 నెలల చిన్నారి మృతి.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
ప్రమాదవశాత్తు బకెట్ లోని నీటిలో పడి 11 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. బిడ్డ ప్రాణాలు పోవడాన్ని తట్టుకోలేక, తన బిడ్డ చావుకు తానే కారణం అని భావించి.. తల్లి ఆత్మ హత్య చేసుకుంది.

హృదయ విదారక సంఘటన
బకెట్ లోని నీటిలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన బెంగళూరులోని చంద్రలే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే.. బిడ్డ చనిపోవడమే బాధాకరం అంటే… ఆ బిడ్డ మరణాన్ని తట్టుకోలేక.. తన బిడ్డ చావుకు తానే కారణం అంటూ సూసైడ్ లెటర్ రాసి.. తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.
టెక్కీ దంపతులు
పూర్తి వివరాల్లోకి వెళితే.. భైరవేశ్వర్ నగర్ కి చెందిన ప్రతిభ (2ా9) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఆమె.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. భర్త మహాంతేశ్ కూడా టెక్కీనే. వీరికి 11 నెలల కుమారుడు అగస్త్య ఉన్నాడు. తన కుమారుడుని చూసుకుంటే.. ప్రతిభ ఇంటి పని, ఆఫీసు పనులు చేసుకునేది.
కాగా.. భర్త ఆఫీసుకు వెళ్లిన తర్వాత.. ప్రతిభ ఆరేసిన దుస్తులు తీసుకురావడానికి బయటకు వెళ్లింది. ఆ సమయంలో బాబు ఆడుకుంటూ వెళ్లి బకెట్ లోని నీటిలో పడి చనిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా, తీవ్ర ఆవేదనతో ప్రతిభ సూసైడ్ నోట్ రాసి.. బలవన్మరణానికి పాల్పడింది.
భర్త రాకతో వెలుగులోకి..
రాత్రి భర్త మహాంతేశ్ ఇంటికి వచ్చేసరికి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య తలుపు తీయకపోవడంతో, తన దగ్గరున్న కీతో డోర్ తెరిచాడు. లోపల ప్రతిభ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించగా, బాబు మృతదేహం బెడ్పై ఉందని మహాంతేశ్ పోలీసులకు తెలిపాడు.
'నేను బట్టలు ఆరేయడానికి టెర్రస్పైకి వెళ్లాను. ఆ సమయంలో బాబు ఆడుకుంటూ బాత్రూమ్లోకి వెళ్లాడు. అక్కడ బకెట్లోని నీటిలో పడి చనిపోయాడు. నా బిడ్డను నేను కాపాడుకోలేకపోయాను. నా కొడుకు చావుకు నేనే కారణం. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా' అని ప్రతిభ డెత్ నోట్లో రాసింది.

