MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • National
  • అమెరికా అడిగిన ఆ ఒక్కటీ ఇచ్చేసి ఉంటే పదవిలో కొనసాగేదాన్ని..: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా

అమెరికా అడిగిన ఆ ఒక్కటీ ఇచ్చేసి ఉంటే పదవిలో కొనసాగేదాన్ని..: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా

తీవ్ర అల్లర్ల మధ్య బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లారు. తమ దేశాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా సహా ఇతర శక్తులు కుట్రలు చేస్తున్నాయని హసీనా ఆరోపించారు. అమెరికా అడిగినట్లు ఓ ద్వీపంపై నియంత్రణ వదులుకోకపోవడం వల్లే తనను అధికారం నుంచి తొలగించినట్లు ఆరోపణలు చేశారు.

2 Min read
Author : Galam Venkata Rao
| Updated : Aug 11 2024, 06:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా స్వదేశాన్ని విడిచిపెట్టారు. అల్లర్లు తారాస్థాయికి చేరడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. ఆ తర్వాత తన రక్షణ కోసం బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కి వచ్చారు. బంగ్లా- భారత్‌ బలగాల పటిష్ట రక్షణ నడుమ ఢాకా నుంచి ఢిల్లీలోని హిండన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కి ఆగస్టు 5న హసీనా చేరుకున్నారు. భారత్‌లో ఆమె తల దాచుకోగా.. ఆమె మన దేశంలోనే సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ప్రకటించారు. ఆ తర్వాత యూకేలో ఆశ్రయం కోసం హసీనా దరఖాస్తు చేసుకోగా.. బ్రిటన్‌ తిరస్కరించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తిరుగుబాటు వెనుక అమెరికా హస్తం...

ఆగస్టు 5వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌లో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగుతున్నాయి. ఆందోళనకారులు, అల్లరి మూకలు ఏకంగా ప్రధాని హసీనా నివాసంలోకి చొరబడ్డారు. ప్రధాని నివాసంలోని వస్తువులు, దుస్తులు, ఇతర విలువైన సామగ్రిని లూటీ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. 

ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు, అల్లర్లు చెలరేగడంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు వెనుక అమెరికా హస్తం ఉందని ఆమె ఆరోపించారు. తన దేశంలో మృతదేహాల ఊరేగింపును తాను చూడాలని అనుకోలేదన్నారు. విద్యార్థుల మృతదేహాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కొందరు భావించారని... దాన్ని తాను అంగీకరించలేదని ఓ ఇంగ్లీష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్‌ వ్యూలో హసీనా పేర్కొన్నారు. ఆ పరిస్థితులు చూడకూడదనే ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. 

35

అధికారం కోసం బాహ్య శక్తుల ప్రయత్నాలు... 

బంగ్లాదేశ్‌లోని సెయింట్ మార్టిన్ ద్వీపంపై నియంత్రణను వదులుకోవడానికి తాను నిరాకరించానని... ఆ కారణంతోనే అమెరికా తనను అధికారం నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తోందని షేక్‌ హసీనా ఆరోపించారు. బంగాళాఖాతంపై పట్టు సాధించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని.. ప్రజలను తప్పుదోవ పట్టించాలని రాడికల్స్ ప్రయత్నిస్తున్నారని.. వారి వలలో పడొద్దని హసీనా కోరారు.

‘హింసాత్మక మార్గాల ద్వారా బాహ్య శక్తులు బంగ్లాదేశ్‌లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. సెయింట్ మార్టిన్ ద్వీపంపై నియంత్రణను వదిలేసి ఉంటే ప్రధాని పదవిలో కొనసాగేదాన్ని. తద్వారా ఈ ప్రాంతంలో US ఆధిపత్యం చెలాయిస్తుంది’ అని హసీనా పేర్కొన్నారు. 

45
Bangladesh protests

Bangladesh protests

అంతా చక్కబడ్డాక తిరిగి వస్తా...

బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలపై హసీనా స్పందించారు. ప్రజలతో పాటు తన పార్టీ సభ్యులపై వేధింపులు, విధ్వంసం, దహన సంఘటనలతో సహా హింసపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా బంగ్లాదేశ్‌కు తాను కట్టుబడి ఉన్నానన్న హసీనా.. దేశం కోసం తమ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తుచేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తానని తెలిపారు. 

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు, రిజర్వేషన్‌ కోటా ఉద్యమాన్ని ఉద్దేశించి... తాను విద్యార్థులను ఎప్పుడూ అవమానకరంగా మాట్లాడలేదని హసీనా స్పష్టం చేశారు. అశాంతిని ప్రేరేపించడానికి ఉద్దేశపూర్వకంగా తన మాటలు వక్రీకరించారని చెప్పారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రదారులు తన ప్రకటనలను తారుమారు చేశారని ఆరోపించారు. పరిస్థితులను విద్యార్థులు అర్థం చేసుకోవాలని కోరారు.

55

క్రిస్టియన్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని...

బంగ్లాదేశ్‌లో సైనిక స్థావరాన్ని నెలకొల్పాలని, తూర్పు తైమూర్ తరహాలో క్రిస్టియన్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపణలు ఉన్నాయి. విస్తృత భౌగోళిక రాజకీయ వ్యూహంలో భాగంగా మానవ హక్కుల ఉల్లంఘనపై బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB)పై ఎన్నికల న్యాయబద్ధత గురించి అమెరికా (US) కల్పిత ఆందోళనలు, ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో ప్రాంతీయ అస్థిరత మయన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవులు, చైనాతో సహా పొరుగు దేశాలతో వివాదాల్లో భారత్‌ను ప్రమేయం చేసే ఒక పెద్ద కుట్రలో భాగమని ఓ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కూడా బంగ్లాదేశ్‌ అల్లర్లలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగ‌తులు.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image2
మోదీ ప‌ర్య‌ట‌న‌వేళ తీవ్ర క‌ల‌క‌లం.. న‌కిలీ ఐడీ, తుపాకీతో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తులు
Recommended image3
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved