Andhra Pradesh: ఇండియా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశే టాప్, ఎన్ని రంగాల్లో కీలకమో చూడండి
Andhra Pradesh: ఇండియాకు ఆంధ్ర ప్రదేశ్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? అనేక ముఖ్య రంగాలకు చెందిన ఉత్పత్తులు ఆంధ్ర ప్రదేశ్ నుంచే దేశ వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ఇండియా మొత్తానికి అవసరమైన శాండిల్వుడ్ 90 శాతం కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుంచే సరఫరా అవుతోందంటే ఆంధ్రా ఎంత స్పెషలో చూడండి. ఇదే కాకుండా అనేక ఆహార ఉత్పత్తుల సరఫరాలో ఆంధ్రా టాప్ లో ఉంది. అవేంటో చూద్దాం రండి.

దక్షిణ భారత దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే దేశం మొత్తానికి అవసరమైన 75 శాతం పామాయిల్ ఆంధ్రా నుంచే సరఫరా అవుతుంది. పామాయిల్ పంట రాయలసీమ, గోదావరి జిల్లాల్లో అధికంగా సాగుచేస్తారు.
అంతే కాకుండా దేశం మొత్తానికి కావాల్సిన మిర్చి పంటలో 60 శాతం విశాఖ జిల్లా నుంచే సరఫరా అవుతుంది.
టమాట సాగుకు కూడా ఆంధ్ర ప్రదేశ్ చాలా ఫేమస్. రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లాలో పండిన టమాట పంట దేశంలో వివిధ రాష్ట్రాలకు సరఫరా అయ్యే ఎగుమతుల్లో 30 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది.
అనంతపురం జిల్లా నుంచే ఏకంగా 30 శాతం బొప్పాయి పంట ఎగుమతి అవుతుంది.
విజయవాడ పరివాహక ప్రాంతాల్లో పండే బాస్మతీ ధాన్యం సాగు దేశ వ్యాప్తంగా ప్రజలు వినియోగించే దాంట్లో 20 శాతం ఇక్కడి నుంచే అందుతుంది.
ఇలా అనేక విషయాల్లో ఆంధ్ర ప్రదేశ్ ముందంజలో ఉంది. భవిష్యత్తులో ఆంధ్రా ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కఈష్ణా గోదావరి బేసిన్ నుంచి సేకరిస్తున్న నేచరల్ గ్యాస్, ఆయిల్స్ భవిష్యత్తులో దేశానికి చాలా అవసరం అవుతాయి.
కేవలం ఆహార ఉత్పత్తుల విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఆంధ్ర ప్రదేశ్ తన ప్రత్యేకతను చాటింది.
ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో సేవలందిస్తున్న రెడ్డీస్, అపోలో లాంటి ఫార్మా సూటుకల్ కంపెనీలు ఆంధ్ర ప్రదేశ్ కి చెందినవే.
కోహినూర్ వజ్రం గోల్కొండ మైన్స్ లోనే తయారైంది. ఈ వజ్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు.
దేశానికి జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తే.
ఇలా అనేక విషయాల్లో ఆంధ్ర ప్రదేశ్ భారత దేశానికి కీర్తి కిరీటంగా నిలుస్తోంది.