డీఎస్పీ దారుణ హత్య.. తల నరికి, శరీరాన్ని ముక్కలు చేసి..
నిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కరడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబేకు చెందిన ముష్కర ముఠా వారిని ఎంత క్రూరంగా హత్యచేసిందనే విషయాన్ని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
ఓ డీఎస్పీని వికాస్ దూబే ముఠా అత్యంత దారుణంగా హత్య చేసింది. పదునైనా గొడ్డలితో నరికి చంపేశారు. అనంతరం శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికేశారు. ఈ దారుణ సంఘటన కాన్పూర్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున దూబేను అదుపులోకి తీసుకునేందుకు అతడి స్వగ్రామమైన బిక్రూకు వెళ్లిన 20మంది పోలీసులను అతడి ముఠా ట్రాప్ చేసి వారిలో 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న ఘోరం తెలిసిందే.
వీరిలో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాను వికాస్ దూబే ముఠా సభ్యులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఓ ఎస్సై శరీరమైతే విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఎక్కడికక్కడ తూటాలతో జల్లెడగా మారింది.
ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కరడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబేకు చెందిన ముష్కర ముఠా వారిని ఎంత క్రూరంగా హత్యచేసిందనే విషయాన్ని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
ఈ హత్యాకాండలో దూబే అనుచరులు ఎంత అమానవీయంగా వ్యవహరించానేది పోస్టుమార్టం నివేదికలో వైద్యులు కళ్లకు కట్టారు. ఆ నివేదిక ప్రకారం.. మిశ్రాను గొడ్డలితో నరికి చంపిన దుండగులు, కానిస్టేబుళ్లు బాబుల్, రాహుల్, సుల్తాన్లను పాయింట్ 315 బోర్ రైఫిల్తో కాల్చి చంపారు.
తల, భుజాల్లో ఎక్కువగా గాయాలు ఉండటం వైద్యులను నివ్వెరపరిచింది. మరో కానిస్టేబుల్ జితేంద్ర పాల్ను ఏకే-47తో కాల్చి చంపారు.
రోడ్డుకు అడ్డంగా జేసీబీని అడ్డుపెట్టి.. వాహనాల్లోంచి దిగిన పోలీసులపైకి మారణాయుధాలతో దాడిచేసి, అనంతరం పోలీసుల నుంచి తుపాకులు లాక్కొని వారిపైకే కాల్పులతో విరుచుకపడిన తీరు తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ దాడిలో పాల్గొన్న నిందితుడు, దూబే ప్రధాన అనుచరుడు అయిన దయా శంకర్ అగ్నిహోత్రిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
కాగా దూబేను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వస్తున్నారన్న సంగతి అతడికి పోలీస్ స్టేషన్ నుంచే ఎవరో ఫోన్ చేసి చెప్పివుంటారని.. అప్రమత్తమైన అతడు అప్పటికప్పుడు ఫోన్లు చేసి పోలీసులపై దాడి చే సేందుకు 25-30 మంది అనుచరులను పిలిపించుకున్నట్లు భావిస్తున్నారు.
వికాస్ దుబే అరెస్టు తర్వాత.. అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అతని ఇంట్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు కుప్పలుగా ఉండటం గమనార్హం. ఇంటికి ఓ గోడౌన్ గా మార్చేయడం గమనార్హం.
బిక్రూ గ్రామంలో అతడి ఇంటిని పోలీసులు నేలమట్టం చేసినప్పుడు భూగర్భ రక్షణ గృహం(బంకర్) వెలుగుచూసింది. అందులో 15 బాంబులు, 2 కిలోల పేలుడు పదార్థాలు, ఆరు పిస్తోళ్లు లభించాయి. బంకర్లలో ఆయుధా లు, పేలుడు పదార్థాలను దాచిన దూబే నేర శైలి మావోయిస్టుల తీరును తలపిస్తోందని కాన్పూర్ రూరల్ ఎస్పీ బీకే శ్రీవాస్తవ చెప్పారు.
అయితే ఇంతంటి కరడుగట్టిన నేరస్థుడైన దూబేపై ఏకంగా 71 క్రిమినల్ కేసులు ఉన్నా కూడా ఇన్నాళ్లూ యూపీ పోలీసులు అతడిని ఎందుకు ఉపేక్షిస్తూ వచ్చారన్నది అంతుబట్టని విషయం. కాగా దూబే నేరచరిత్రపై తమకు అవగాహన లేకపోవడంతోనే తీవ్రంగా దెబ్బతిన్నామని కాన్పూర్ ఎస్ఎస్పీ దినేశ్ కుమార్ చెప్పారు.