పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చదివింది అస్సలు మర్చిపోరు
మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? చదివింది గుర్తుండటం లేదా? అయితే మీ ప్రిపరేషన్ బాగా సాగాలన్నా, చదివింది గుర్తుండాలన్నా నిపుణులు సూచించిన ఈ సింపుల్ టెక్నిక్ పాటించండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ ఇచ్చింది. ఇంకా వేలల్లో పోస్టులు నింపేందుకు రెడీ అవుతోందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేశారు. అయితే ఇప్పుడున్న ఒత్తిడి జీవితంలో చదివింది గుర్తుంచుకోవాలంటే కొంచెం కష్టమే. కాని ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా చదివింది గుర్తుంటుంది.
పరీక్షల సమయంలో విద్యార్థులు కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి చదివింది గుర్తుండకపోవడం. ఈ పరిస్థితిని అనుభవించే ఎగ్జామ్స్ టైమ్ లో చదివింది గుర్తురాక నిరాశ చెందుతూ ఉంటారు. ఎగ్జామ్స్ టైప్ ప్రెజర్, ప్రిపరేషన్ తక్కువ ఉండటం వంటి అనేక కారణాల వల్ల ఒత్తిడి పడి సరిగ్గా పరీక్షలు రాయలేరు. ఈ సమస్యతో బాధపడే వారికి విద్యా నిపుణులు ఇస్తున్న సూచనలు ఏంటంటే..
1. చాలా మంది విద్యార్థులు చదివే విషయం అర్థం చేసుకోకుండా కేవలం కంఠస్తం చేస్తారు. దీని వల్ల సమాచారాన్ని మెదడు సరిగ్గా నిల్వ చేయదు. అందుకే అర్థం చేసుకొని చదవాలి.
2. ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం చాలా మంది ఎంత చదివినా గుర్తుంచుకోలేకపోతారు. అందుకే చదివేవారికి ప్రశాంతంగా అనిపించే ప్లేస్ లో కూర్చొని చదవాలి. అది ఇంటి పైన కావచ్చు. ఫ్రెండ్ రూమ్, లైబ్రరీ ఇలా ఎక్కడ కాన్సన్ట్రేషన్ కుదురుతుందో తెలుసుకొని అక్కడ ప్రిపేర్ అయితే త్వరగా మైండ్ లోకి వెళ్తుంది. చదివింది గుర్తుంటుంది.
3. కొంతమంది చదవాల్సిన సబ్జెక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడికి లోనవుతారు. చదివిన విషయం సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల కూడా మతిమరుపు కలగవచ్చు. ఇలాంటి సమస్య ఉన్న వారు మదర్ టంగ్ అంటే తెలుగు, హిందీ ఇలా ఎవరి భాషలో వారు సబ్జెక్ట్ చదివితేనే సులభంగా గుర్తుపెట్టుకోగలరని నిపుణులు సూచిస్తున్నారు.
4. చదివింది ఈజీగా గుర్తుండాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజూ కొంతసేపు రివిజన్ చేసుకోవడం వల్ల మెమరీ పెరుగుతుంది. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చక్కటి నిద్ర వల్ల ఒత్తిడి తగ్గి చదివిందంతా గుర్తుంటుంది.
5. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారు ఒకేసారి ఎక్కువ విషయాలు చదవడం కాకుండా మధ్యమధ్యలో బ్రేక్ తీసుకుంటూ అధ్యయనం చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. సీనియర్ల సూచనలు వినడం వల్ల మర్చిపోకుండా ఈజీగా చదవడానికి, గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.