MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పండ్లు తిన్నవెంటనే నీళ్లను తాగుతున్నారా..? అయితే మీ పని మటాషే..!

పండ్లు తిన్నవెంటనే నీళ్లను తాగుతున్నారా..? అయితే మీ పని మటాషే..!

పండ్ల ద్వారా మన శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రోటీన్లు అందుతాయి. అందుకే వీటిని రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 09 2022, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
fruits

fruits

పండ్లలో ఎన్నో పోషకాలుంటాయి. వీటిని రోజూ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. దీంతో శరీరం సక్రమంగా పనిచేస్తుంది. పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. కొన్ని రకాల పండ్లు బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఇంతేకాదు పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఉంది. అయితే కొంతమంది పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగుతుంటారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

26

జీర్ణక్రియపై చెడు ప్రభావం

పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగితే జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల అజీర్థి, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు అప్పుడే నీళ్లను తాగితే పండ్ల ద్వారా గ్రహించిన పోషకాలు శరీర భాగాలకు చేరవు. దీనివల్ల కడుపులో సమస్యలు వస్తాయి. అందుకే పండ్లు తిన్నవెంటనే నీళ్లను తాగకండి. కావాలంటే గంట తర్వాత తాగండి. 
 

36
acidity

acidity

ఎసిడిటీ

మీరు ఎలాంటి పండ్లను తిన్నా.. అప్పుడే నీళ్లను తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల ఎంజైమ్లు, జీర్ణ రసాల పనితీరు సరిగ్గా ఉండదు. దీంతో ఎసిడిటీ సమస్యకు దారితీస్తుంది. 
 

46

పొట్ట తిమ్మిరి

పండ్లు తిని ఆ వెంటనే నీళ్లను తాగితే.. గ్యాస్ సమస్య వస్తుంది. అంతేకాదు కడుపు నొప్పి, అపానవాయువు ఎక్కువగా రిలీజ్ అవుతుంది. నీళ్ల వల్ల పొట్టలోని ఆమ్లాలు పలుచబడి ఈ సమస్యలు వస్తాయి. 
 

 

56

రక్తంలో చక్కెర స్థాయిలు

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగితే..అవి సరిగ్గా జీర్ణం కావు. దీంతో అవి కొవ్వుగా మారుతాయి. ఇవే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి దారితీస్తాయి. పండ్లు తిన్నప్పుడల్లా నీళ్లను ఇలాగే తాగితే ఊబకాయం, డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

66

ఆహారం సరిగ్గా అరగదు

మనం తిన్న ఆహారాలు అరగడానికి జీర్ణ రసాలు ఉపయోగపడతాయి. అయితే ఇలా నీటిని తాగితే.. పొట్టలోని జీర్ణ రసాలు పలుచగా అయ్యి తిన్నది సరిగ్గా అరగదు. దీంతో గుండెల్లో మంట పుడతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Healthy Eating Tips: జామ పండును కేవలం నీటితో కడిగితే చాలదు, ఇలా క్లీన్ చేయాలి..
Recommended image2
Money Plant: ఇదొక్క పొడి వేస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది..!
Recommended image3
Gold Earrings: ఒక్క గ్రాములో అదిరిపోయే ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved