Skin care: ముఖం అందం కోసం ముల్తానీ మట్టి, చందనంలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొహం అందంగా, కాంతివంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు. వారి చర్మానికి తగ్గట్టుగా రకరకాల ఫేస్ ప్యాక్ లు, క్రీములు అప్లై చేస్తూ ఉంటారు. ఎక్కువశాతం మంది సహజంగా దొరికే ముల్తానీ మట్టి, చందనాన్ని వాడుతుంటారు. ఈ రెండూ ఫేస్ కి మంచిదే అయినప్పటికీ వాటిలో ఏది బెస్టో మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.

ముఖం అందం పెంచే పదార్థాల్లో ముల్తానీమట్టి, చందనం ముందు వరుసలో ఉంటాయి. చాలా ఏళ్లుగా వీటిని వాడుతున్నారు. కొందరు చందనం పొడిని ఫేస్ ప్యాక్లా వేసుకుంటారు. మరికొందరు ముల్తానీ మట్టిని ఉపయోగిస్తారు. ఇంతకీ ఈ రెండింటిలో పొడి చర్మానికి ఏది మంచిదో ఇక్కడ చూద్దాం.
ఏది బెస్ట్?
సాధారణంగా జిడ్డు చర్మం ఉన్నవాళ్లకి ముల్తానీ మట్టి, చందనం రెండూ మంచివే. ఎందుకంటే ఇవి ముఖంలో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ని పీల్చేస్తాయి. కానీ పొడి చర్మం ఉన్నవాళ్లకి చందనం కంటే ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ బెస్ట్ ఆప్షన్.
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్:
పొడి చర్మం ఉంటే ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ వేయడానికి ముల్తానీ మట్టితో పాలు, పెరుగు, తేనె వాడొచ్చు. ఎందుకంటే వీటిలో తేమనిచ్చే గుణాలు ఉంటాయి. చర్మాన్ని తేమగా ఉంచుతాయి.
ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ లాభాలు:
- ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ముఖం మీద ఉండే నల్ల మచ్చలు, తెల్ల మచ్చల సమస్యల్ని తగ్గిస్తుంది.
- ఈ ఫేస్ ప్యాక్ మొటిమలు, బొబ్బల నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఇంకా చర్మాన్ని టైట్గా చేస్తుంది.