MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • muharram 2022: మొహర్రం రోజున ముస్లింలు రక్తాన్ని చిందించేది ఇందుకే..

muharram 2022: మొహర్రం రోజున ముస్లింలు రక్తాన్ని చిందించేది ఇందుకే..

muharram 2022: రంజాన్ తర్వాత ముస్లింలు జరుపుకునే పండుగల్లో మొహర్రం ఒకటి. అసలే దీన్ని పండుగే అనరు. మొహర్రం పదో రోజున ముస్లిం యువకులంతా చేతులతో గుండెలను బాదుకుంటూ రక్తాన్ని చిందిస్తారు. ఇలా చేయడానికి కారణమేంటో తెలుసా..? 

1 Min read
Mahesh Rajamoni
Published : Aug 02 2022, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మొహరం పండుగనే  పీర్ల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే దీన్ని త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు బ్లేడ్లను తీసుకుని శరీరానికి గాయాలు చేసుకుంటూ రక్తాన్ని చిందిస్తారు. అందుకే దీన్ని పండుగ అనరు. దీన్ని సంతాప దినంలాగే ముస్లిం లు జరుపుకుంటారు. 
 

25

మొహర్రం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఇనామ్ హుస్సేన్. మహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్ ఇస్లాం మతాన్ని కాపాడటం కోసం ఎంతో కృషి చేస్తాడు. ఇస్లాం గురించి కర్బలా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ అమరుడవుతాడు. 14 శతాబ్దాల క్రితం మొహర్రం 10వ రోజున జరిగిన కర్బలా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ ను క్రూర పాలకుడు, నియంత అయిన యాజీద్ సైన్యం నిర్దాక్షిణ్యంగా హతమార్చింది. కాగా ఈ పవిత్ర మాసంలోనే హుస్సేన్ ప్రాణత్యాగం చేస్తాడు. అతని జ్ఞాపకార్థం ముస్లింలు సంతాప దినాలను పది రోజుల పాటు నిర్వహిస్తారు.
 

35

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ కొత్త ఏడాది మొహర్రంతోనే మొదలవుతుంది. క్రీ.శ 622 లో మొదటి ఇస్లామిక్ రాజ్యం స్థాపనకు గుర్తుంగా ఈ నెల గుర్తింపు పొందింది. 

45

అమరులైన వారికి ఆత్మ శాంతించాలని ప్రార్థనలు చేస్తూ ముస్లింలు ఉపవాసాలు ఉంటారు. అంతేకాదు షియా ముస్లింలు బ్లాక్ డ్రెస్ ను వేసుకుని..చేతులతో గుండెలపై బాధుకుంటూ గట్టిగట్టిగా ఏడుస్తారు. బ్లేడ్లతో శరీరాన్ని గాయం చేసుకుంటూ రక్తాన్ని చిందిస్తారు. కొరడాలతో కొట్టుకోవడమే కాదు.. నిప్పుల గుండాల్లో కూడా నడుస్తారు.  అయితే ఇలా రక్తాన్ని చిందించడం వల్ల అల్లాహ్ మోక్షం లభిస్తుందని కొంతమంది నమ్ముతారు.

55

ఏదేమైనా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ అమరుడైనా.. దయ, సమానత్వం, సమన్యాయం అతని సందేశాలతో  నేటికీ ప్రజల మధ్యన జీవిస్తున్నాడని ముస్లింలు విశ్వసిస్తారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
బంగారం లాంటి పట్టీలు.. తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్లు
Recommended image2
ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవి..
Recommended image3
మూడు గ్రాముల్లో అదిరిపోయే బంగారు జుంకాలు.. చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved