Railway Rules: టికెట్ తీసుకున్న తర్వాత రైలు మిస్ అయితే ఏం చేయాలి? రిఫండ్ వస్తుందా?
Railway Rules: రైల్వే సంస్థ మనకు చాలా సదుపాయాలు ఇస్తుంది. కానీ, వాటిని తెలుసుకోకపోతే మనమే చాలా నష్టపోతాం. మరి, ఎప్పుడైనా టికెట్ కొన్న తర్వాత రైలు మిస్ అయితే.. మనకు ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయా అని ఆలోచించారా?

Indian Railway
భారతదేశంలో చాలా మంది ఎక్కువగా రైలు ప్రయాణాలే చేస్తూ ఉంటారు. ట్రెయిన్ జర్నీ సౌకర్యంగానే ఉంటుంది. కానీ.. రైలు ఎక్కడమే అసలైన సవాలు. రైళ్లు చాలా సార్లు టైమ్ కి రావు. ఒక్కోసారి మనం వెళ్లి స్టేషన్ లో కూర్చొన్నా.. ఆలస్యంగా వస్తాయి.. మరోసారి.. మనం వెళ్ళేలోగా.. ట్రైన్ మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
మనం ఇంటి నుంచి ముందుగానే బయలుదేరినప్పటికీ.. ట్రాఫిక్ కారణంగానే.. మరేదైనా కారణం వల్ల గానీ.. రైలు మిస్ అవ్వడం చాలా మందికి జరిగే ఉంటుంది. మరి.. మనం టికెట్ తీసుకున్న తర్వాత రైలు ఎక్కలేకపోయాం కదా.. మనకు ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయా? మనం కొన్న టికెట్ కి రీఫండ్ చేస్తారా? రైల్వే అధికారులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం...

జనరల్ టికెట్ కొనుగోలు చేస్తే....
జనరల్ అంటే రిజర్వేషన్ లేకుండా టికెట్ తీసుకున్న ప్రయాణికులు రైలు మిస్ అయితే.. వారికి కొన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇదే టికెట్ తో అదే కేటగిరికి చెందిన మరో రైలు లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. సాధారణంగా, ఒక జనరల్ టికెట్ మూడు గంటల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆలోగా అదే మార్గంలో ప్రయాణించే మరో రైలు ఎక్కొచ్చు. అయితే... జనరల్ టికెట్ తీసుకొని ప్రీమియమ్ రైలు ఎక్కితే మాత్రం.. ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
మెయిల్/ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్, రాజధాని, శతాబ్ది, లేదా వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో జనరల్ టిక్కెట్లు చెల్లవు. ఈ రైళ్లలో జనరల్ టిక్కెట్టుతో ప్రయాణిస్తూ టికెట్ కలెక్టర్ కి దొరికిపోతే భారీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
రిజర్వేషన్ చేసుకున్న తర్వాత రైలు మిస్ అయితే...
మీరు ముందుగానే రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న రైలు మిస్ అయితే... ఆ టికెట్ తో మరో రైలులో ప్రయాణించలేరు. అలా చేస్తే.. కచ్చితంగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఒక వేళ ప్రయాణికుడు జరిమానా చెల్లించడానికి నిరాకరించింనా, లేదా వాగ్వాదానికి దిగినా.. ఆ ప్రయాణికుడిని రైల్వే పోలీసులకు అప్పగించవచ్చు. చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.
ట్రైన్ మిస్ అయితే రిఫండ్ రాదా..?
మీరు ట్రైన్ మిస్ అయిన వెంటనే TDR (టికెట్ డిపాజిట్ రసీదు) దాఖలు చేయాలి. దాదాపు టికెట్ డబ్బులు తిరిగి మనకు రిఫండ్ అయితే రాదు. అయితే, రైలు మూడు గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయ్యి.. టైమింగ్స్ మారడం వల్ల మీరు ఆ రైలులో ప్రయాణించలేకపోతే.. అప్పుడు టికెట్ మనీ రిఫండ్ అయ్యే అవకాశం ఉంటుది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు ఒక స్టేషన్ లో ట్రైన్ మిస్ అయితే... తర్వాతి రెండు స్టేషన్ల వరకు మీ సీట్లను ఎవరికీ కేటాయించరు. అంటే.. తర్వాతి రెండు స్టేషన్ సమయానికి మీరు చేరుకొని.. అక్కడ రైలు ఎక్కితే.. మీ సీటు మీకే ఉంటుంది.

