IRCTC: ట్రైన్ లేటుగా వస్తే రైల్వే శాఖ ఫైన్ కడుతుందా? కన్జుమర్ కోర్టు ఏం చెప్పిందంటే...
IRCTC: రైల్వేలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఫైన్ కట్టించుకుంటారు. మరి ట్రైన్ ఆలస్యం అయితే కూడా రైల్వేశాఖ ఫైన్ కడుతుందా? ఓ కేసులో రైల్వేశాఖ రూ.లక్షా 30వేల ఫైన్ కట్టిందంట. ఎందుకో తెలుసా?

ట్రైన్ ఆలస్యంగా వస్తే రైల్వేశాఖ ఎందుకు ఫైన్ కట్టదు?
ట్రైన్లో కావొచ్చు, బస్సులో కావొచ్చు...టికెట్ లేని ప్రయాణం నేరం. లేదంటే జరిమానా, జైలు శిక్ష ఉంటుందని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు పెడతారు. ఈ నిబంధన కేవలం ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందా? ట్రైన్ లో టికెట్ లేకుండా వెళ్తే వెంటనే టీసీ వచ్చి నచ్చినంత ఫైన్ రాసి వెళ్లిపోతారు. ఇవ్వకపోతే అక్కడికక్కడే దించేస్తారు. బాగానే ఉంది. అంత డబ్బులు ఖర్చు పెట్టి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే...ట్రైన్ ఆలస్యంగా వస్తే రైల్వేశాఖ ఎందుకు ఫైన్ కట్టదు?
రూ.లక్షా30వేల ఫైన్ కట్టిన రైల్వేశాఖ
చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి....ఈ ఇన్సిడెంట్ ను సీరియస్ గా తీసుకుని కోర్టుకెక్కారు. ఇది ఇండియన్ రైల్వేస్ హిస్టరీలో ఒక రేర్ ఇన్సిడెంట్. ట్రైన్ ఆలస్యంగా వెళ్లిందని రైల్వే శాఖ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.లక్షా30వేల ఫైన్ కట్టాల్సి వచ్చింది.
7 గంటలు ఆలస్యంగా వచ్చిన ట్రైన్
అసలేం జరిగిందంటే...ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఒడిశా జర్సుగూడ నుంచి హౌరాకు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాడు. అక్కడి నుంచి 4 గంటల గ్యాప్ పెట్టుకుని ఉదయం 8 గంటలకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. కానీ...ట్రైన్ ఆలస్యం కావడం వల్ల ఫ్లైట్ మిస్ అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..ట్రైన్ బయల్దేరడమే 2 గంటలు లేటు. పైగా హౌరా చేరేసరికి 7 గంటలు డిలే అయింది. దాంతో మరో విమాన టికెట్ బుక్ చేసుకోవల్సి వచ్చింది.
కోర్టు మొట్టికాయలు
కానీ అతను అక్కడితో ఆ విషయం వదిలేయకుండా ..కన్జుమర్ కోర్టులో ఫిర్యాదులో చేశాడు. దానికి IRCA ఏం చెప్పిదంటే...ట్రైన్ టైమింగ్స్ కు గ్యారెంటీ లేదంటూ బాధ్యత లేని మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. IRCA మాటలపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు...పబ్లిక్ సర్వీసు అంటే బాధ్యత ఉండాలని మొట్టికాయలు వేసింది. ట్రైన్ టైమింగ్స్ గ్యారెంటీ లేదన్న మాటలు ఒప్పుకోలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు..ఫ్లైట్ టికెట్ రూ.20వేలు, మానసిక ఒత్తిడికి రూ.30వేలు, లీగల్ విషయాలపై రూ.5వేలు చొప్పున రూ.55 వేలు జరిమానా విధించింది.
పెనాల్టీ కట్టిన రైల్వేశాఖ
రైల్వే ఈ ఫైన్ కట్టేసి ఉంటే సరిపోయేది. కానీ టైంకు చెల్లించకపోవడంతో కోర్టు మళ్లీ రోజుకు రూ.500 చొప్పున పెనాల్టీ విధించింది. 200 రోజులు ఆలస్యం కావడంతో...పెనాల్టీతో కలిపి మొత్తం రూ.1,30,000 కట్టాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. సో దీన్ని బట్టి అర్థమయ్యింది ఏంటీ అంటే...కామన్ పీపుల్ గట్టిగా నిలబడితే న్యాయం జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు.

