MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Meals: రోజులో ఒక వ్యక్తి ఎన్నిసార్లు తింటే ఆరోగ్యం? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

Meals: రోజులో ఒక వ్యక్తి ఎన్నిసార్లు తింటే ఆరోగ్యం? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

మనం తినే ఆహారమే (Meals) మన ఆరోగ్యానికి రక్ష. అయితే రోజులో ఎన్నిసార్లు తినాలన్న దానిపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఇక అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి. 

2 Min read
Haritha Chappa
Published : Oct 12 2025, 07:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రోజుకు ఎన్నిసార్లు తినాలి?
Image Credit : istock

రోజుకు ఎన్నిసార్లు తినాలి?

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. అయితే రోజుకు ఎన్నిసార్లు తినాలన్న విషయంలో మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది. ఒకరు రోజులో ఒకసారి మాత్రమే పూర్తి స్థాయిలో భోజనం చేస్తారు. మరికొందరు రెండుసార్లు చేస్తారు. ఇంకొందరు మూడుసార్లు చేస్తారు. మరికొందరు కొంచెం కొంచెంగా తింటూ నాలుగైదు సార్లు భోజనం తింటూ ఉంటారు. ఒక వ్యక్తి ఎన్ని సార్లు తింటే ఆరోగ్యకరమో తెలుసుకోండి.

24
సమతుల్య భోజనం
Image Credit : Pixabay

సమతుల్య భోజనం

రోజులో ఎన్నిసార్లు తింటామన్నది ముఖ్యం కాదు.. మన శరీరానికి సమతుల్య భోజనం, ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందా లేదా అన్నది చూసుకోవాలి. మీకు వీలైనట్టు రోజుకు రెండు నుండి మూడుసార్లు భోజనం తినడం ఉత్తమం. ఆ రెండు మూడు భోజనాల్లో అల్పాహారం ఎంతో ప్రధానమైనది. ఇక మధ్యాహ్న భోజనం తప్పనిసరి. రాత్రి భోజనం చాలామంది తినరు. ఆ సమయంలో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు వంటివి తింటూ ఉంటారు. ఏదైనా సరే ఆకలితో పొట్టను ఎక్కువసేపు ఉంచకూడదు. మీ భోజనం సమతుల్యంగా ఉండాలి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఖనిజాలు అన్నీ నిండి ఉండేలా చూసుకోవాలి.

Related Articles

Related image1
ఖాళీ పొట్టతో ఆపిల్ తింటే మీకు ఊహించని ప్రయోజనాలు
Related image2
కాల్షియం లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే
34
రోజులో ఒకసారి మాత్రమే తింటే
Image Credit : Pixabay

రోజులో ఒకసారి మాత్రమే తింటే

కొంతమంది ఈరోజుకు ఒకసారి మాత్రమే పూర్తి భోజనం చేస్తారు. ఈ పద్ధతి బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. కానీ సురక్షితమైన పద్ధతి మాత్రం కాదు. శారీరక శ్రమ అధికంగా చేసేవారు లేదా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇలా ఒకసారి తినడం అనేది వారికి అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. ఒకసారి పూర్తిస్థాయిలో భోజనం చేసేవారు ప్రతి రెండు మూడు గంటలకి ఏదో ఒక ఆహారాన్ని తింటూ ఉండాలి. నట్స్, సీడ్స్, పండ్లు, క్యారెట్లు వంటివి తింటూ ఉంటే ఎలాంటి పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడవచ్చు.

44
రోజులో నాలుగైదుసార్లు తింటే
Image Credit : Pixabay

రోజులో నాలుగైదుసార్లు తింటే

ఇక రోజుకి రెండు మూడుసార్లు తినే వారితో ఇలాంటి సమస్య లేదు. మరి కొందరు నాలుగైదు సార్లు భోజనాన్ని తింటారు. అయితే వాటిని చిన్నచిన్న భోజనాలుగా విడదీసుకొని తింటారు. ఇది నిజానికి మంచి పద్ధతి. జీవక్రియను చురుకుగా ఉంచుతుంది. శరీరానికి శక్తి అందేలా చేస్తుంది. అదే నాలుగైదు సార్లు భోజనం చేసేవారు తక్కువ పరిమాణంలోనే తినాలి. ప్రతిసారి ఎక్కువ పరిమాణంలో తింటే త్వరగా బరువు పెరిగిపోతారు. క్యాలరీలు అధికంగా శరీరంలో చేరుతాయి. ఇక జంక్ ఫుడ్, పంచదార కలిసిన స్వీట్లు వంటివి మాత్రం తీసుకోవడం మంచిది కాదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved