ఐస్ క్యూబ్స్ తో గొంతునొప్పి మటుమాయం.. ఎలా ఉపయోగించాలంటే..?
సీజన్ మారుతున్న సమయంలో గొంతు నొప్పి సర్వ సాధారణం. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఇంట్లోనే చాలా సులువుగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..
మారుతున్న వాతావరణం, సీజన్ కారణంగా చాలా మందికి గొంతు నొప్పి వస్తుంది. ఈ గొంతునొప్పి దానంతట అదే వారం రోజుల్లో తగ్గిపోతుంది. అయినప్పటికీ.. అన్ని రోజులు గొంతునొప్పిని భరించాలంటే కష్టమే. ఎందుకంటే గొంతునొప్పి వల్ల సరిగ్గా మాట్లాడటానికి రాదు. తినడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఇంట్లోనే చాలా తొందరగా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.
నేషనల్ హెల్త్ సర్వీస్, యుకె ప్రకారం.. గొంతునొప్పితో బాధపడేవారు ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి సమయంలో వేడినీళ్లు, ఇతర పానీయాలను అస్సలు తాగకూడదు. వీటికి బదులుగా ఐస్ క్యూబ్స్, ice lollies ను తీసుకోవడం వల్ల మంటనుంచి ఉపశమనం కలుగుతుంది.
కోల్డ్ థెరపీ ఎలా పనిచేస్తుంది?
ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ లోలీల నుంచి వాటర్ ను పీల్చడం వల్ల గొంతు హైడ్రేట్ అవుతుంది. అలాగే మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఐస్ లొల్లీలు గొంతు నొప్పిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి ఎర్రబడిన కణజాలాలను చల్లగా చేస్తాయి. దీంతో నొప్పి కాస్త తగ్గుతుంది. ఐస్ పాప్స్ గొంతులోని నరాల చివరల ఉష్ణోగ్రతను చాలా వరకు తగ్గిస్తాయి.దీంతో నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
గొంతునొప్పికి చికిత్స తీసుకున్న తర్వాత కూడా డాక్టర్లు ఐస్ క్రీం ను తినాలని చెప్తుంటారు. చల్లని ఐస్ క్రీంను తినడం వల్ల ఎర్రబడిన టాన్సిల్స్ ను తాకి.. వాపు తగ్గుతుంది. దీంతో అసౌకర్యం, నొప్పి రెండూ తగ్గిపోతాయి. వీటితో పాటుగా గొంతునొప్పిని ఇంట్లోని వస్తువులతో ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం పదండి..
ఉప్పు నీరు..
గోరు వెచ్చని ఉప్పు నీళ్లను తీసుకుని.. నోట్లో పోసి పుక్కిలిస్తే మంట చాలా వరకు తగ్గుతుంది. అయితే పిల్లలు మాత్రం ఇలా అస్సలు చేయకూడదు. ఇందుకోసం గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తీసుకుని అందులో అర టీస్పూన్ ఉప్పును వేసి కరిగించండి. ఈ వాటర్ ను నోట్లో పోసుకుని పుక్కిలించినా.. లేదా మింగినా నొప్పి తగ్గుతుంది.అయితే ఎక్కువ సార్లు ఇలాగే చేయాలి.
పసుపు పాలు..
పసుపులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అంటువ్యాధులతో పోరాడుతాయి. గొంతు నొప్పి ఉన్నవారు పడుకునే ముందు పసుపు పాలను తాగితే మంచిది. ఈ పసుపు పాలను బంగారు అమృతం అని కూడా అంటారు. రాత్రిపూట ఈ పసుపు పాలను తాగడం వల్ల మీకు కడుపు ఉబ్బరం వచ్చినట్టైతే తక్కువ తాగండి. లేదంటే పగటిపూట ఎప్పుడైనా తాగండి. ఒక కప్పు పాలను తీసుకుని అందులో చిటికెడు పసుపును కలపండి. దీనికి కొద్దిగా నల్ల మిరియాల పొడిని కలుపుకుని కూడా తాగొచ్చు.
ఆవిరిని పీల్చండి
ఆవిరిని పీల్చడం వల్ల వల్ల కూడా గొంతు నొప్పి తగ్గుతుంది. ఆవిరి వల్ల నాసికా మార్గాలు బాగా తెరచుకుంటాయి. ఈ ఆవిరి.. గొంతు, ఊపిరితిత్తులల్లో నిరోధించబడిన, జిగటగా ఉండే శ్లేష్మాన్ని వదులు చేస్తుంది. ఇందుకోసం నీటిని వేడి చేసి.. ఆవిరిని పీల్చండి.
అల్లం టీ
గొంతునొప్పిని తగ్గించడంలో వేడి వేడి అల్లం టీ బాగా ఉపయోగపడుతుంది. ఇది వాపును తగ్గిస్తుంది. ఇందుకోసం అల్లం ను నీటిలో మరగబెట్టి దాన్ని వడకట్టి తాగండి. మీరు రోజూ తాగే టీలో టీ పౌడర్, పాలకు ను పోసే ముందు ఆ నీటిలో అల్లాన్ని వేసి మరిగించండి.