MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cooking Tips : కూరలు రుచిగా కావడం లేదా? కారణం ఇదే

Cooking Tips : కూరలు రుచిగా కావడం లేదా? కారణం ఇదే

Cooking Tips: కొంతమంది కూరలు టేస్టీగా కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల మసాలా దినుసులు వేస్తుంటారు. అయినా కూర మాత్రం టేస్ట్ గా కాదు. ఇది వాళ్లను ఎంతో డిసప్పాయింట్ కు గురిచేస్తుంది. అసలు కూరలు ఎందుకు టేస్ట్ కావో తెలుసా? 

3 Min read
Shivaleela Rajamoni
Published : Oct 11 2025, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుకింగ్ టిప్స్
Image Credit : chatgpt

కుకింగ్ టిప్స్

కూరలు చాలా టేస్టీగా కావాలని ఆడవాళ్లు ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఏవేవో మసాలా దినుసులను కూడా వేస్తుంటారు. కానీ కొంతమంది ఎంత ఓపిగ్గా, ఎన్ని మసాలా దినుసులు వేసి చేసినా అస్సలు టేస్ట్ కావు. ఇలా ఎందుకు అవుతుందో తెలియక చాలా మంది ఇక నాకు వంటలు రావని బాధ పడుతుంటారు. 

కానీ కొంతమంది ఎలాంటి మసాలా దినుసులు వేయకున్నా చాలా టేస్టీగా అవుతుంటాయి. దీనికి కొన్ని సీక్రేట్స్ యే కారణమన్న సంగతి మీకు తెలుసా? అవును మీరు కూడా కొన్ని ట్రిక్స్ ను ఫాలో అయితే మీరు చేసిన ప్రతి వంటా ఎంతో టేస్టీగా అవుతుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
చల్లని నూనెలో టెంపరింగ్
Image Credit : freepik

చల్లని నూనెలో టెంపరింగ్

చాలా మంది హడావుడిలో లేదా వేరే పని బిజీలో ఉండి నూనె వేడి కాకముందే పోపు దినుసులను, మసాలాలను వేస్తుంటారు. కానీ ఇలా చేస్తే కూర అస్సలు టేస్ట్ కాదు. నూనె వేడి కాకముందే జీలకర్ర, ఆవాలను వేస్తే అవి వాటి సువాసనను విడుదల చేయవు. దీనివల్ల వాటి సువాసన, రుచి కూరగాయలకు పట్టవు. అందుకే పోపును ఎప్పుడూ కూడా వేడి నూనెలోనే వేయాలి. అప్పుడే మీ కూర టేస్ట్ వస్తుంది. మంచి సువాసన వస్తుంది.

మసాలా దినుసులను బాగా వేయించకపోవడం

కూర టేస్ట్ కావాలంటే మీరు కేవలం అవసరమైన మసాలా దినుసులను వేస్తే సరిపోదు. వాటిని బాగా వేయించడం కూడా అవసరమే. ఎందుకంటే మసాలా దినుసుల్లో పచ్చిదనం అలాగే ఉండి కూరలు టేస్ట్ కావు. చాలా మంది కొత్తిమీర, పసుపు లేదా మిరపకాయలు వంటి మసాలా మసాలా దినుసులను వేయించరు. కానీ వీటిని తక్కువ మంట మీద రెండు నిమిషాలు ఖచ్చితంగా వేయించాలి. అప్పుడే అవి బాగా వేగి ఫుడ్ టేస్ట్ అవుతుంది.

Related Articles

Related image1
ఈ పొరపాట్లు చేస్తే ఫ్రిజ్ తొందరగా పాడవుతుంది
Related image2
ఈ ఒక్కటి పెట్టినా రాగి పాత్రలు కొత్తవాటిలా తలతలా మెరుస్తాయి
35
 సరైన సమయంలో ఉప్పు వేయడం
Image Credit : Getty

సరైన సమయంలో ఉప్పు వేయడం

కూరలో ఉప్పు వేశామా? లేదా? అని కాకుండా సరైన సమయంలో వేస్తేనే మీ వంట టేస్ట్ అవుతుంది. అవును కూర మొత్తం అయిన తర్వాత ఉప్పు వేస్తే మీరు చేసిన కూరటేస్ట్ పాడవుతుంది. ఉప్పును ఎప్పుడైనా సరే కూర స్టార్టింగ్ లోనే వేయాలి. అప్పుడే ఉప్పు కూరగాయల్లో బాగా కలిసిపోతుంది. అదే మీరు లేట్ గా ఉప్పును వేస్తే ఉప్పు మొత్తం కరగదు. ఇది కాకుండా కూరలో ఉప్పును కూరగాయలు సగం ఉడికిన తర్వాత వేయడం బెటర్. ఇది కూరలో బాగా కరిగి రుచిని పెంచుతుంది.

మూతపెట్టాలి

చాలా మంది కూరపై మూత పెట్టకుండానే వంట చేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. మీరు ఏ కూర చేసినా మూత ఖచ్చితంగా పెట్టాలి. లేదంటే మీరు చేసే కూర టేస్ట్ బాగుండదు. దీనివల్ల కూరగాయలు అతిగా ఉడికి టేస్ట్ పోతుంది. అందుకే ఏ కూర చేసినా మీరు గిన్నెపై మూత పెట్టి ప్రతి మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి మూత తీసి కూరను కలుపుతూ ఉండండి.

45
ప్రతి కూరలో మసాలా దినుసులను వేయడం
Image Credit : Asianet News

ప్రతి కూరలో మసాలా దినుసులను వేయడం

కూరలు టేస్ట్ కావడానికి మసాలా దినుసులు కూడా బాగా ఉపయోగపడతాయి. అది సొరకాయ అయినా కావొచ్చు. బెండకాయ, దొండకాయ అయినా కావొచ్చు. ప్రతి కూరలో మసాలా దినుసులను వేసుకోవచ్చు. కానీ ఏ కూరలో ఏ మసాలా వేయాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏది పడితే అది వేస్తే కూడా టేస్ట్ మారుతుంది. కసూరి మేతి, ధనియా పౌడర్ వంటివి కూరల టేస్ట్ ను పెంచుతాయి.

ఫ్రెష్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం

కూరలు చేసేటప్పుడు తాజా పదార్థాలను ఉపయోగించాలి. ఎందుకంటే ఫ్రెష్ కూరగాయలతో కూర టేస్టీగా అవుతుంది. ఎప్పుడో తరిగిన కూరగాయలు, ఫ్రిజ్ లో ఉంచిన పాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటివి కూరను టేస్ట్ కాకుండా చేస్తుంటాయి. అందుకే ఫ్రెష్ కొత్తిమీద, ఫ్రెష్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వంటివి వాడండి. ఇవి కూర టేస్ట్ ను పెంచుతాయి.

55
ఉల్లిపాయలు, టమాటాలు సరిగ్గా ఉడికించకపోవడం
Image Credit : Asianet News

ఉల్లిపాయలు, టమాటాలు సరిగ్గా ఉడికించకపోవడం

చాలా మంది ఉల్లిపాయ బంగారు గోధుమ రంగులోకి మారకుండానే టమాటాలను వేసి కలుపుతుంటాయి. దీనివల్ల ఉల్లిపాయ పచ్చిదనం పోదు. దీనివల్ల కూర టేస్ట్ కాదు. అందుకే ఉల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అంతేకాకుండా టమాటాలు వేసిన వెంటనే మసాలా దినుసులను వేయడం మానుకోవాలి. దీనివల్ల టమాటాలు రుచిగా ఉండవు. కాబట్టి టమాటాలనే కాసేపు వేయించి తర్వాత మసాలా దినుసులను వేయాలి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
మహిళలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved