Health tips : నీళ్లతో ఆ సమస్యలన్నీ పరార్
Health tips : శరీరంలోని జీవక్రియలన్నీ సక్రమంగా పనిచేయడానికి నీరు ఎంతో అవసరం. అంతేకాదు మనకొచ్చే సగం జబ్బులను నీళ్లు తాగి నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నీరే మనల్ని కరోనా వైరస్ బారిన పడకుండా చేయగలదని నిపుణులు సూచిస్తున్నారు.

Health tips : ఈ భూమ్మిదున్న అన్ని ప్రాణులకు అత్యంత విలువైనది, అన్నింటికంటే ముఖ్యమైనది ఏదైనా ఉందా అంటే అది నీరనే చెప్పాలి. ఆహారం లేకుండా నైనా కొన్ని రోజులు కాలాన్ని వెళ్లదీయొచ్చు గానీ నీరు లేకుండా ఒక్కరోజుకంటే ఎక్కవ సమయం జీవించలేని జీవులున్నాయి. అందుకే ఈ నీరు సకల ప్రాణులకు ప్రాణాధారమైంది. కానీ చాలా మంది పని హడావుడిలో పడో లేక నీటిని తాగాలనిపించకనో నీళ్లను బొత్తిగా తాగడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్లే శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. అంతే కాదు కిడ్నీల్లో రాళ్లు అలాగే ఇతర అనారోగ్య సమస్యలు నీళ్లు తాగకపోవడం వల్లే వస్తాయి. ఈ విషయాలన్నీ తెలిసి కూడా నీళ్లను తాగని వారు లేకపోలేదు. అంతెందుకు కొంతమంది తినేటప్పుుడు మాత్రమే రెండు మూడు బుక్కల నీటిని తాగుతారు. ఇలాంటి వారు రోజు మొత్తంలో ఒక లీటర్ నీటిని కూడా తాగరేమో. అయితే శరీరానికి కావాల్సిన నీటిని తీసుకుంటేనే అధిక బరువు, ఇతర రోగాల నుంచి తప్పించుకోగలం. ఒకవేళ నీటిని తాగాలనిపించకపోతే.. దానిని పరిష్కార మార్గాలు చాలానే ఉన్నాయి.
మీకు తెలుసా.. మన శరీర బరువు ఎంతుందో.. అందులో ప్రతి 20 కిలోలకు ఒక లీటర్ నీటిని తాగాలని కొంత మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే 60 కిలోల బరువున్నవారు రోజుకు దాదాపుగా 3 లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాల్సిందే. అంతేకాదు కొన్ని కొన్ని సమయాల్లో నీటిని తాగకుండా అస్సలు ఉండకూడదని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పడుకునే ముందు ఎలాగైతే ఒకగ్లాసు నీటిని తాగుతామో.. అలాగే ఉదయం లేచిన వెంటనే మరువకుండా రెండు గ్లాసుల నీటిని తాగాలి. ఇలా తాగితేనే శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా శరీర అవయావాలన్నీ సక్రమంగా పనిచేయగలుగుతాయని నిపుుణులు చెబుతున్నారు
టిఫిన్ చేసేముందు లేదా భోజనం లేదా ఏ ఆహారం తీసుకునేటప్పుడైనా ఒక అరగంట ముందే ఒక గ్లాసు నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ బాగుంటుంది. స్నానం చేసే ముందు కూడా ఒక గ్లాసు నీటిని తాగడం వల్ల రక్తపోటు ప్రమాదం వచ్చే అవకాశమే ఉండదు. అంతేకాదు నైట్ టైం పడుకునే ముందు కూడా ఒక గ్లాసు నీళ్లను తాగితే Heart attack వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటన్నింటి ద్వారా లీటరున్నర వరకు నీళ్లను తాగుతుంటాం. కానీ మిగిలిన నీళ్లను తాగడం మానేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే వాటిని కూడా చక్కగా తాగుతారు.
రొటిన్ గా గ్లాసులు, నార్మల్ వాటర్ బాటిల్స్ లల్లో కాకుండా రంగు రంగుల బాటిళ్లను ఎంచుకుని వాటిలో నీళ్లను నింపండి. వాటిని మీరు పని చేస్తే ప్లేస్ లో మీకు ఎదురుగా ఉండేలా పెట్టుకోండి. అప్పుడు వాటిని చూసినప్పుడల్లా మీకు నీళ్లను తాగాలన్నా విషయం గుర్తుకు వస్తుంది.
నీళ్లను అలాగే తాగాలంటే కూడా కొందరికి నచ్చదు. ఎందుకంటే నీళ్లు రుచిగా అనిపించవు గనుక. అందుకే నీళ్లకు కాస్త రుచిని జోడిస్తే ఈజీగా తాగేయొచ్చు. అందుకోసం ఏం చేయాలంటే .. స్ట్రాబెర్రీలు. పుదీనా, పుచ్చకాయ ముక్కలు, కీరా వంటి పండ్లలో వేటినైనా ఒక దాన్ని ఎంచుకుని వాటిని ముక్కలుగా కోసి నీళ్లలో వేయండి. ఆ బాటిల్ ను ఫ్రిజ్ లో పెండితే.. రుచికరమైన నీళ్లు తయారైనట్టే.