ఆయుర్వేదం ప్రకారం.. రాత్రిపూట వీటిని అస్సలు తినకూడదు.. ఒకవేళ తిన్నారో మీ పని అంతే..!
అజీర్థి, గ్యాస్ట్రిక్, మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలున్న వారు రాత్రిపూట కొన్ని ఆహారాలను అసలే తినకూడదు. ఒకవేళ తింటే ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతేకాదు రాత్రిళ్లు నిద్రఉండదు.

రాత్రిపూట కొంతమందికి కడుపులో భారంగా అనిపిస్తుంది. అంతేకాదు అజీర్థి సమస్యతో కూడా బాధపడుతుంటారు. ముఖ్యంగా కొంతమందికి తిన్న తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఎసిడిటీ సమస్య వస్తుంది. ఈ సమస్యల వల్ల రాత్రిపూట అసలే నిద్రపోరు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లైఫ్ స్టైల్ మెరుగ్గా లేకుంటేనే ఈ సమస్యలన్నీ వస్తాయి. అందుకే కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను
ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్నాక్స్
చాలా మంది పడుకునే ముందు ఉప్పు ఉక్కువగా ఉండే లేదా స్నాక్స్, ప్రాసెస్ చేసిన స్వీట్లను తింటుంటారు. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో శరీరానికి హాని చేసే ఎన్నో రసాయనాలు ఉంటాయి. ఇవి మీకు రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తాయి. అంతేకాదు ఇవి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. దీంతో మీరు తిన్నది సరిగ్గా అరగదు. మలబద్దకం సమస్య కూడా రావొచ్చు. ఈ అలవాటును వదులుకోకపోతే.. కడుపునకు సంబంధించిన సమస్యలు రోజు రోజుకు పెరుగుతాయి.
ఆయిలీ లేదా వేయించిన ఆహారాలు
ఆయిలీ ఫుడ్స్, వేయించిన ఆహారాలను పగటిపూట తిన్నా ఎలాంటి సమస్య ఉండదు. ఈ సమయంలో తింటే బాగా అరుగుతాయి. కానీ వీటిని రాత్రిపూట తింటే అంత సులువుగా అరగవు. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల మీ కడుపులో శరీరానికి హాని చేసే ట్యాక్సిన్స్ ఏర్పడతాయి. దీంతో వాంతులు, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిపూట ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండండి.
పండ్లు
సీజనల్ పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిని పొద్దంతా తినొచ్చు కానీ.. రాత్రిపూట మాత్రం అస్సలు తినకూడదు. ఎందుకంటే పండ్లు చాలా చల్లగా ఉంటాయి. వీటిని రాత్రిపూట తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలెర్జీ కూడా రావొచ్చు.
ఎర్ర మాంసం
రెడ్ మీట్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది రెడ్ మీట్ ను చలికాలంలో ఎక్కువగా తింటుంటారు. ఎందుకంటే దీన్ని తినడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది. కానీ వీటిని రాత్రిపూట అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో మీకు రాత్రిళ్లు నిద్ర ఉండదు.
పెరుగు
నిజానికి పెరుగు కడుపునకు చాలా మంచిది. పెరుగును తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. కానీ ఆయుర్వేదం ప్రకారం.. పెరుగును రాత్రిపూట అసలే తినకూడదు. ఎందుకంటే పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటుగా పెరుగులో చలువ చేసే గుణాలు ఉంటాయి. ఇది ముందే చలికాలం. ఈ సీజన్ లో పెరుగును రాత్రిపూట తింటే ఛాతిలో బరువుగా అనిపిస్తుంది. జలుబు కూడా చేస్తుంది. అందుకే రాత్రిపూట పెరుగుకు దూరంగా ఉండండి.