MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • PM Modi: మోదీ ఇండోనేసియా టూర్‌లో కీల‌క ఒప్పందం.. ఇది భార‌త్ స‌త్తా

PM Modi: మోదీ ఇండోనేసియా టూర్‌లో కీల‌క ఒప్పందం.. ఇది భార‌త్ స‌త్తా

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియా పర్యటనలో భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన పలు ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, అస్త్ర ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల సరఫరాపై ఒప్పందం జరిగింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 07 2026, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రక్షణ రంగంలో భారత్ ఇండోనేసియా కొత్త అధ్యాయం
Image Credit : Narendra Modi/X

రక్షణ రంగంలో భారత్-ఇండోనేసియా కొత్త అధ్యాయం

మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేసియా రాజధాని జకార్తాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, సముద్ర భద్రత, కీలక ఖనిజాలు, సాంకేతికత, ఔషధాలు, ఆహార భద్రత తదితర రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

రక్షణ రంగంలో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు. ఇండోనేసియా సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ క్షిపణులను దశలవారీగా అందించేందుకు భారత్ అంగీకరించింది. అంతేకాకుండా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణులను కూడా ఇండోనేసియా దిగుమతి చేసుకోనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
క్షిపణులతో పాటు పూర్తి రక్షణ ప్యాకేజీ
Image Credit : Narendra Modi/X

క్షిపణులతో పాటు పూర్తి రక్షణ ప్యాకేజీ

బ్రహ్మోస్ ఒప్పందం కేవలం క్షిపణుల సరఫరాతో ముగియదు. తీరప్రాంత మొబైల్ లాంచర్లు, రాడార్ వ్యవస్థలు, సైనిక శిక్షణ, నిర్వహణ సేవలు, సాంకేతిక సహాయం వంటి అంశాలను కూడా ఇందులో భాగంగా అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేసియా తన తీర భద్రతను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది.

అలాగే ఇండోనేసియాలోని కీలక ఖనిజాల రంగంలో కూడా భారత్ పెట్టుబడులు పెట్టనుంది. ముఖ్యంగా స్టీల్, నికెల్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిలో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. మలక్కా జలసంధికి సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన సబాంగ్ పోర్టు అభివృద్ధిలో కూడా భారత్ భాగస్వామ్యం కానుంది. అదనంగా, ఇండోనేసియా అవసరాల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తయారీలో సాంకేతిక సహాయం అందించేందుకు కూడా అంగీకారం కుదిరింది.

Related Articles

Related image1
Facts: ట్ర‌క్కుల వెనుక 'Use Dipper At Night' అని ఎందుకు రాస్తారు? దీనికి కండోమ్‌కి సంబంధం ఏంటి.?
Related image2
Chicken facts: చికెన్ పేద‌ల ఆహారమా.? కోడి మాంసానికి అస‌లీ పేరు ఎలా వ‌చ్చిందంటే.?
34
ఇండో-పసిఫిక్‌లో భారత్ వ్యూహానికి మరింత బలం
Image Credit : Narendra Modi/X

ఇండో-పసిఫిక్‌లో భారత్ వ్యూహానికి మరింత బలం

బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతులు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులను భారత్ సరఫరా చేస్తుండగా, ఇప్పుడు ఇండోనేసియా కూడా ఆ జాబితాలో చేరింది. వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా ఈ క్షిపణుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

రక్షణ ఎగుమతుల్లో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు, ప్రాంతీయ భద్రతలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. బ్రహ్మోస్ వంటి స్వదేశీ ఆయుధ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ భారత రక్షణ తయారీ రంగానికి కూడా పెద్ద ఊతమివ్వనుంది.

44
మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం
Image Credit : Narendra Modi/X

మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం

ఈ పర్యటనలో మరో విశేషం కూడా చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారమైన 'బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా' అవార్డును ప్రదానం చేసింది. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వయంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. భారత్-ఇండోనేసియా సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం అందించినట్లు ఇండోనేసియా ప్రభుత్వం తెలిపింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Tourism: ప్ర‌పంచంలో అత్యంత అంద‌మైన గ్రామం.. రోడ్లు లేని ప్రాంతం, ప‌డ‌వ‌ల్లోనే ప్ర‌యాణం
Recommended image2
Bus Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు, 40 మంది మృతి
Recommended image3
Viral News: మహిళా ఎంపీ ఇంట్లో బంగారు బికినీ.? సోష‌ల్ మీడియాను ఊపేస్తున్న ఫొటోలు
Related Stories
Recommended image1
Facts: ట్ర‌క్కుల వెనుక 'Use Dipper At Night' అని ఎందుకు రాస్తారు? దీనికి కండోమ్‌కి సంబంధం ఏంటి.?
Recommended image2
Chicken facts: చికెన్ పేద‌ల ఆహారమా.? కోడి మాంసానికి అస‌లీ పేరు ఎలా వ‌చ్చిందంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved