MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Operation Sidoor : ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2 కు రెడీ : రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

Operation Sidoor : ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2 కు రెడీ : రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

Operation Sidoor : ఆపరేషన్ సిందూర్ ముగిసినా ఇప్పటికీ బారతీయుల్లో దానిపై చర్చ సాగుతుంటుంది. ఇలాంటిది స్వయంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 'ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2' అంటూ విదేశీ గడ్డపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 22 2025, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2 కి కూడా రెడీ..
Image Credit : ANI

ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2 కి కూడా రెడీ..

Operation Sidoor : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సత్తా ఏమిటో చాటిచెప్పిన ఘటన ఆపరేషన్ సిందూర్. తమతో పెట్టుకుంటే దేశంలోకి చొరబడిన ఉగ్రమూకలనే కాదు దేశం అవతల ఉన్న ఉగ్రవాదులను అంతమొందిస్తామని ఈ ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రుదేశాలకు సందేశం పంపించింది భారత్. ఈ ఆపరేషన్ ను పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకోసం చేపట్టింది... బాంబుల వర్షం కురిపించి వందలమంది ఉగ్రవాదులను అంతమొందించింది. అయితే ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని... పాకిస్థాన్ తీరునుబట్టి పార్ట్ 2, పార్ట్ 3 ఆధారపడి ఉంటుందని తాజాగా భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

25
విదేేశీ గడ్డపై రాజ్ నాథ్ సంచలన కామెంట్స్
Image Credit : X/Anish Singh (@anishsingh21)

విదేేశీ గడ్డపై రాజ్ నాథ్ సంచలన కామెంట్స్

రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రస్తుతం మొరాకో పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశంలోని ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ తో విబేధాలు గురించి మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఉగ్రవాదులు మానవత్వం లేకుండా వ్వహరించారని... పహల్గాంలో మతం అడిగిమరీ పర్యాటకులను కాల్చిచంపారని అన్నారు. ఇందుకు భారతసైన్యం ప్రతీకారం తీర్చుకుందని… కులమతాలు చూడకుండానే ఉగ్రవాదులను ఏరివేసిందన్నారు. ప్రధాని మోదీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు... దీనివల్లే ఆపరేషన్ సిందూర్ సాధ్యమయ్యిందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 

Related Articles

Related image1
Modi - Sushila Karki : నేపాల్ ప్రధానికి మోదీ ఫోన్ ... ఏం మాట్లాడారో తెలుసా?
Related image2
India Pakistan Handshake Controversy : ఇండియా, పాకిస్థాన్ కెప్టెన్లకు షేక్ హ్యాండ్ వద్దన్నది ఆయనేనా?
35
పాకిస్థాన్ రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్
Image Credit : ANI

పాకిస్థాన్ రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని మంత్రి తెలిపారు. ఆ తర్వాత కూడా పాకిస్థాన్ అభ్యర్థించడం వల్లే దాడులను విరమించామని అన్నారు. మళ్లీ పాక్ రెచ్చగొట్టే చర్యలకు దిగినా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్ లో హింసకు ప్రేరేపించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుందా? ఉండదా? అనేది పాకిస్థాన్ తీరునుబట్టి డిసైడ్ అవుతుందన్నారు. ఉగ్రవాదులకు తగినవిధంగా బుద్ది చెప్పేందుకు భారత్ ఎల్లప్పుడూ రెడీగా ఉంటుందని... దేశాన్ని సురక్షితంగా ఉంచడమే తమ మొదటి కర్తవ్యమని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

45
యావత్ ప్రపంచం చూపు భారత్ వైపే
Image Credit : ANI

యావత్ ప్రపంచం చూపు భారత్ వైపే

ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయ సమాజంలో భారత్ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ మాట్లాడితే దాన్ని అంత సీరియస్‌గా తీసుకునేవారు కాదు... ఈ రోజు భారత్ మాట్లాడితే ప్రపంచం మొత్తం జాగ్రత్తగా వింటుందన్నారు. భౌగోళికంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని... ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు రక్షణ మంత్రి.

55
 గ్లోబల్ హబ్‌గా భారత్
Image Credit : ANI

గ్లోబల్ హబ్‌గా భారత్

భారత్ స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా మారుతోందని... 2014లో భారత్‌లో 500 స్టార్టప్‌లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1.60 లక్షలకు పెరిగిందన్నారు రక్షణ మంత్రి. 2014 లో 18గా ఉన్న యునికార్న్‌ల సంఖ్య ఈ రోజు 118కి చేరిందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆపరేషన్ సింధూర్
భారత దేశం
పాకిస్తాన్
సాయుధ దళాలు
ఏషియానెట్ న్యూస్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Neal Katyal : ట్రంప్ కే చుక్కలు చూపిస్తున్న భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్..?
Recommended image2
US Tariffs : ట్రంప్ టారీఫ్స్ కు సుప్రీం బ్రేక్ .. అమెరికా అధ్యక్షుడి పవర్ ఈ చట్టంముందు తుస్సుమందిగా..!
Recommended image3
Bangladesh Cabinet : బంగ్లాదేశ్ కేబినెట్‌లో హిందూ మంత్రి.. ఎవరీ గయేశ్వర్ చంద్ర రాయ్?
Related Stories
Recommended image1
Modi - Sushila Karki : నేపాల్ ప్రధానికి మోదీ ఫోన్ ... ఏం మాట్లాడారో తెలుసా?
Recommended image2
India Pakistan Handshake Controversy : ఇండియా, పాకిస్థాన్ కెప్టెన్లకు షేక్ హ్యాండ్ వద్దన్నది ఆయనేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved