కరోనాను ఎదుర్కొనేందుకు ఎయిమ్స్ డాక్టర్ చెబుతున్న మూడు చిట్కాలు..!
మూడు చిట్కాలు ఫాలో అయితే.. కరోనాని సులభంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఎయిమ్స్ వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గతేడాదితో పోలిస్తే కరోనా ప్రభావం దేశంలో మరింత పెరిగిపోయింది. ప్రతిరోజూ తక్కువలో తక్కువ రెండు లక్షల కరోనా కేసులు నమోదౌతున్నాయి. ఎప్పుడు ఎవరిపై ఎలా ఈ మహమ్మారి ఎటాక్ చేస్తుందో కూడా తెలియడం లేదు. కరోనా ఎటాక్ చేసిన తర్వాత.. దాని నుంచి బయటపడాలంటే జనాలు భయపడిపోతున్నారు.
అయితే... ఈ వైరస్ సోకకముందే.. దీనిని ఎదుర్కోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయవచ్చని ఎయిమ్స్ వైద్యులు సూచిస్తున్నారు. మూడు చిట్కాలు ఫాలో అయితే.. కరోనాని సులభంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఎయిమ్స్ వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ రనదీప్ గులేరియా ప్రజలకు మూడు నియమాలను తెలియజేశారు. వాటిలో మొదటిది.. కరోనా కంటైనర్ జోన్స్ తెలుసుకోవడం, రెండోది గుంపులు గుంపులుగా ఉండకుండా.. సామాజిక దూరం పాటించడం, మూడోది వ్యాక్సిన్ వేయించుకోవడం.
ఈ మూడు నియమాలు ఫాలో అయితే.. కరోనాని నియత్రించవచ్చని ఆయన చెబుతున్నారు.
‘ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విభిన్న రూపాల్లో విజృంభిస్తోంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఏ ప్రాంతాల్లో కరోనా ఎక్కువగా విజృంభిస్తోందో.. ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలి. టెక్నాలజీ సాయంతో కంటోన్మెంట్ జోన్లను గుర్తించొచ్చు’ అని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
ప్రతి ఒక్కరూ హ్యుమానిటీ కలిగి ఉండాలని.. అదేవిధంగా పాజిటివ్ ఆలోచించడం కూడా నేర్చుకోవడం తప్పనిసరి అని చెప్పారు.
సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అని ఆయన చెప్పారు. ఇలా చేస్తే.. కరోనా సెకండ్ వేవ్ త్వరగా దేశంలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సూచించారు.