స్త్రీ, పురుషుల్లో ఆ సమస్య.. ఇదొక్కటి ఉంటే చాలు..!
ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నా... కేవలం ఒక్క ఆహార పదార్థంతో వాటిని తరిమేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేంటో.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..
ప్రస్తుత రోజుల్లో పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారు చాలా అరుదు అనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. మన లైఫ్ స్టైల్ కారణంగానూ ఈ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అయితే.. ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నా... కేవలం ఒక్క ఆహార పదార్థంతో వాటిని తరిమేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేంటో.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..
ఆల్మండ్ రెసిన్.. దీనినే మనం తెలుగులో బాదం బంక, బాదం జిగురు అని పిలుస్తుంటారు. దీనిని తీసుకుంటే... ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను పరిష్కరించవచ్చట. దీని వలనకు మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట
మన శరీరానికి సరిపడ విటమిన్స్, మినరల్స్ చాల అవసరం. ఇవి సరిగా మన శరీరానికి అందకపోవడం వల్లనే.. శారీరక సమస్యలు మొదలౌతాయి. అయితే.. ఈ బాదం బంక లో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
బాదాం జిగురును నీటిలో గంట పాటు నానబెట్టి తీసుకుంటే శరీర వేడి తగ్గుతుంది. అంతేగాకుండా బరువు తగ్గాలనుకునే వారికి బాదం జిగురు దివ్యౌషధం లాంటిది.
అయితే.. దీనినే బరువు పెరగడానికి కూడా వాడుకోవచ్చట. బాదం జిగురును ప్రతిరోజూ పాలల్లో కలిపి తీసుకుంటే.. సులభంగా బరువు పెరుగుతారట. అదే నీటిలో కలిపి తీసుకుంటే.. బరువు తగ్గొచ్చు.
బాదాం జిగురును నీటిలో నానబెట్టి వారానికి మూడు సార్లు తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు.
వ్యాధులు దరిచేరకుండా వుండేందుకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కిడ్నీ సంబంధిత రోగాలు దరిచేరవు. వేసవి డీ-హైడ్రేషన్ కాకుండా వుండాలంటే.. బాదాం జిగురును జ్యూస్ల్లో కాసింత చేర్చడం మంచి ఫలితాలను ఇస్తుంది.
అంతేకాకుండా.. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా.. దీనిని తీసుకోవడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుందట.
ఈ మధ్యకాలంలో చాలా మంది పురుషసులు వీర్యం సంఖ్య తగ్గి.. సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి ఇది దివ్య ఔషధం లా పనిచేస్తుందని వారు చెబుతున్నారు.