డయాబెటీస్ పేషెంట్లు తప్పనిసరిగా తినాల్సిన చిరుధాన్యాలు ఇవి..!
డయాబెటీసే పేషెంట్లకు కొన్ని రకాల చిరుధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ మీకు డయాబెటీస్ లేకపోయినా వీటిని తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో రోజు రోజుకు డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే ఇండియాను డయాబెటిస్ రాజధాని అని కూడా అంటుంటారు. దీన్ని నియంత్రించకపోతే కొన్నేండ్లలో భారత్ అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్తులున్న దేశంగా మారిపోతుంది. అయితే ఈ వ్యాధి రావడానికి భారతీయ జీవనశైలి, ఆహారమే కారణమంటున్నారు నిపుణులు. మన జీవనశైలి మిస్టేక్స్ వల్లే ఈ సమస్య పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ జీవితాంతం జీవితాంతం మిమ్మల్ని విడిచిపెట్టదు. ఎందుకంటే దీన్ని పూర్తిగా నయం చేసుకోలేం. అందుకే ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే ఈ వ్యాధి ఉన్నవారు దీన్ని నియంత్రించానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అలాగే శారీరకంగా చురుగ్గా ఉండాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటీస్ పేషెంట్లకు కొన్ని రకాల చిరుధాన్యాలు మంచి మేలు చేస్తాయి. వీటిని డయాబెటీస్ లేనివారు కూడా తినొచ్చు. ఎందుకంటే ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి మధుమేహులు ఎలాంటి చిరుధాన్యాలను ఖచ్చితంగా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చిరుధాన్యాలు
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. చిరుధాన్యాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. ఇది శరీరంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తుంది. దీంతో డయాబెటిస్ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. ఇవి ఇన్సులిన్ సున్నితత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. చిరుధాన్యాల పిండితో తయారు చేసిన రోటీ మొదలైన వాటిని తినొచ్చు.
రాగులు
పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. రాగుల్లో ఉండే పాలీఫెనాల్స్, యాంటీ డయాబెటిక్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పాలీఫెనాల్స్ పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలలో ఉండే ఒక రకమైన సూక్ష్మపోషకాలు కూడా రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
రాగులు నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలేట్, థియామిన్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలకు గొప్ప మూలం. అంతేకాదు ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీంతో మీరు కేలరీలను ఎక్కువగా తీసుకోలేరు. ఆహార కోరికలు కూడా తగ్గుతాయి. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
జొన్నలు
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. జొన్నల్లో స్మార్ట్ కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. దీన్ని తీసుకోవడం వల్ల గ్లూకోజ్ రక్తంలోకి ప్రవేశిస్తుంది. అలాగే ఇది వెంటనే రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. అలాగే జొన్నలు అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది. మీరు అన్నానికి బదులుగా జొన్నల రొట్టెను తినొచ్చు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లకు ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.