ఫోన్, ల్యాప్ టాప్ చూసి కంటి నొప్పి వస్తోందా? తగ్గాలంటే ఇలా చేయండి
ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటి నొప్పి వస్తుంది. అంతేకాదు ఇతర కంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ కంటి నొప్పిని తగ్గించుకోవచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మన శరీరంలోని ప్రతి భాగం మృదువుగా ఉంటుంది. కానీ వీటిలో మన కళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాదు చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్లద్దాలను వాడుతున్నారు. కంటి సంరక్షణలో ఏ చిన్న పొరపాటు చేసినా పెద్ద సమస్యలనే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. దీనివల్లే ఎన్నో కంటి సమస్యలు వస్తున్నాయి. ఎలకా్ట్రనిక్ గాడ్జెట్లను మితిమీరి వాడటం వల్ల కళ్లు బలహీనపడతాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో కంటి సమస్యలు వస్తాయి. ఫోన్లు లేదా ల్యాప్టాప్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ల నొప్పి వస్తుంది. మరి ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
cucumber
కీరదోసకాయ
మొబైల్ డివైజ్ లు, ల్యాప్ టాప్ లలో ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్లలో నొప్పి వస్తుంటే.. కీరదోసకాయ ఈ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పిని తగ్గించుకోవాలంటే కీరదోసకాయ ముక్కలను కట్ చేసి కళ్లపై 20 నిమిషాల పాటు పెట్టండి. ఇది కాకుండా కీరదోసకాయను తురిమి మీ కళ్లపై పెట్టండి. కీరదోసకాయలను ఉపయోగించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
రోజ్ వాటర్
రోజ్ వాటర్ కూడా కళ్లకు మేలు చేస్తుంది. రోజ్ వాటర్ కంటి నొప్పిని, చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం 2 నుంచి 3 చుక్కల రోజ్ వాటర్ ను కళ్లలో వేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. కళ్లలో దురద సమస్యకు కూడా రోజ్ వాటర్ ప్రయోజనకరంగా ఉంటుంది.
బంగాళాదుంపలు
కీరదోసకాయల మాదిరిగానే బంగాళాదుంపలు కూడా కంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం ముందుగా బంగాళాదుంప ముక్కలను కట్ చేసి ఫ్రిజ్ లో 20 నిమిషాలు పెట్టండి. ఆ తర్వాత చల్లటి ముక్కలను మీ కళ్లపై పెట్టుకోండి. దీని వాడకం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.