ఉదయం పరిగడుపున తినాల్సిన ఆహారాలు, వాటి ప్రయోజనాలు మీకోసం..
కొన్ని ఆహారాలను పరిగడుపున తింటే ఎంతో మంచి జరుగుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఉదయం పరిగడుపున ఎలాంటి ఆహారాలను తినాలి? వాటి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

empty stomach
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీలను తాగే బదులు కొన్ని ఆహారాలు తింటే మన ఆరోగ్యం బాగుంటుందంటున్నారు నిపుణులు. ఇవి మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా , రీఫ్రెష్ గా ఉంచుతాయి. ఇందుకోసం ఉదయం పరగడుపున ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నెయ్యి
నెయ్యి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, కొవ్వులు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున ఒక చెంచా నెయ్యిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం కూడా తగ్గిపోతుంది.
ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తాగితే వీటిలోని పోషకాలు రెట్టింపు అవుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
dates
ఖర్జూరాలు
ఖర్జూరాల్లో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5 వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాలను నానబెట్టి తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య పోతుంది. ఖర్జూరాలను నానబెట్టడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి కూడా ఖర్జూరాలు సహాయపడుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
Soaked Almonds
బాదం
రోజూ గుప్పెడు బాదం పప్పులను తింటే ఆరోగ్యం బెషుగ్గా ఉంటుంది. బాదంలో ప్రోటీన్, ఐరన్, ఫాస్పరస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల బీపి కంట్రోల్ లో ఉంటుంది. ఈ బాదం పప్పులు జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
వాల్ నట్స్
విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో క్యాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
మెంతులు
మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మెంతులను నీటిలో నానబెట్టడం వల్ల వీటిలోని ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. వీటి లక్షణాలు కూడా పెరుగుతాయి. మెంతులను నీటిలో నానబెట్టిన తర్వాత ఆ నీటిని తాగడం వల్ల టైప్-2 డయాబెటిస్ ను నియంత్రణలో ఉంటుంది. ఇవి బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి, బరువును నియంత్రించడానికి సహాయపడతాయి. మెంతులతో కాచిన నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మెంతి వాటర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వంటి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడటమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను కూడా పెంచుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి నానబెట్టిన మెంతులను ఆహారంలో చేర్చుకోవడం కూడా మంచిది.