MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • కిస్ మిస్ లను ఉడికించిన నీళ్లను తాగితే ఇంత మంచిదా?

కిస్ మిస్ లను ఉడికించిన నీళ్లను తాగితే ఇంత మంచిదా?

కిస్ మిస్ లు అదే ఎండుద్రాక్షల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో పోషకలోపాలను పోగొడుతాయి. మీకు తెలుసా? రోజూ కిస్ మిస్ లను మరిగించిన నీళ్లను తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయట.  

2 Min read
Mahesh Rajamoni
Published : Jun 06 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కిస్ మిస్ లల్లో పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇలాంటి వాటిని నీళ్లలో నానబెడితే పోషకాలు రెట్టింపు అవుతాయి. వీటి ప్రయోజనాలు పెరుగుతాయి. ఇందుకోసం రెండు గ్లాసుల నీటిని మరిగించి అందులో 150 గ్రాముల ఎండుద్రాక్షలను వేయాలి. వీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి కొద్దిగా వేడి చేసి పరిగడుపున తాగితే ఎంతో మంచి జరుగుతుంది. ఎండుద్రాక్షలతో మరిగించిన నీటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను పోగొడుతుంది. అందుకే  ఈ సమస్య ఉన్నవారు ఈ నీటిని రోజూ తాగాలని నిపుణులు చెబుతున్నారు. 

25

కిస్ మిస్ లను జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగించడానికి బాగా సహాయపడతాయి. అంతేకాదు ఇవి ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. 

35
<p>raisins-</p>

<p>raisins-</p>

ఈ వాటర్ మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎండుద్రాక్షలతో కాచిన నీటిని కూడా తాగొచ్చు. ఈ వాటర్ మన గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలు కూడా పొటాషియానికి మంచి వనరు. ఎండుద్రాక్షలు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అందుకే మధుమేహులు, హై బీపీ పేషెంట్లు ఈ నీటిని రోజూ తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

45
raisins

raisins

ఎండుద్రాక్షలు మరిగించిన నీటిని తాగితే కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వాటర్ కూడా కాలేయ సంబంధిత సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. ఎండుద్రాక్షలు మరిగించిన నీరు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. 

55
raisins

raisins

ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. ఎండుద్రాక్షలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ వాటర్ కూడా మన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే  ఇది ఎసిడిటీ, మలబద్దకాన్ని నివారిస్తుంది. ఎండుద్రాక్షలతో మరిగించిన నీటిని తాగడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇది ఎన్నో అంటువ్యాధులు, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ వాటర్ మన జుట్టు ఆరోగ్యం, పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఉదయమా లేదా రాత్రా..? చల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది?
Recommended image2
ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!
Recommended image3
Headache: ఉదయం లేవగానే తలనొప్పి బాధిస్తోందా..? కారణాలు ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved