Health Tips: మినరల్ వాటర్ ని వేడి చేసి తాగొచ్చా.. అపోహలు మాని నిజాలు తెలుసుకోండి?
Health Tips: మినరల్ వాటర్ వాడకం విషయంలో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. మినరల్ వాటర్ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోకండి.. నిజానిజాలు తెలుసుకోండి. అవేంటో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మొత్తానికి మనం ఎదురు చూసిన వర్షాకాలం వచ్చేసింది. ఈ వర్షాకాలం చల్లదనంతో పాటు ఇన్ఫెక్షన్లను కూడా తీసుకువస్తుందని మనందరికీ తెలిసిందే. దీని ఇన్ఫెక్షన్ల వలన ఉపసంతాల నొప్పి జలుబు జ్వరం లాంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి.
ఎంత నీరు తాగినా గొంతు ఆరిపోయినట్లుగా అనిపిస్తుంది. అలాంటి వారికి వేడి నీరు త్రాగటం వలన గొంతు పొడిబారడం తగ్గి ఉపశమనం కలిగినట్లుగా అనిపిస్తుంది. నిజానికి వేడి నీరు త్రాగటం గొంతుకకి మంచిది కూడా.
అయితే చాలామంది ఇప్పుడు ఇళ్లల్లో వాటర్ ప్యూరిఫైయర్లు పెట్టుకుంటున్నారు అలాగే ప్యూరిఫైయర్ వాటర్ క్యాన్లు కూడా తెప్పించుకుంటున్నారు వాటినే అన్నింటికి వాడుతున్నారు.
ఇక్కడ జనాలకి వచ్చిన పెద్ద అనుమానం ఏంటంటే మినరల్ వాటర్ ని వేడి చేసి తాగవచ్చా లేకపోతే వేడి చేయడం వల్ల వాటర్ లో ఉండే అవసరమైన ఖనిజాలు, మినరల్స్ అన్ని పోతాయా అనే అనుమానం పట్టిపీడిస్తుంది కాబట్టి నిజా నిజాలు తెలుసుకుందాం.
నిజానికి బయట నీట్ నీరు కొని త్రాగుతూ ఉంటాం నిర్దిష్ట బ్రాండ్లు మినహా అన్ని ఆర్వో అంటే శుద్ధి చేసిన నీరు అని అర్థం. కాబట్టి మనం ఆల్రెడీ శుద్ధి చేసిన నీటిని తాగుతున్నాం అలాంటి నీటిని వేడి చేయడం వలన అందులో ఉండే అధిక భాస్వరం రావణాలు శుద్ధికరణ సమయంలో బయటికి పోతాయి.
అలాగే ఇతర పోషకాలు కూడా ఆవిరిలో కలిసిపోతాయి అని అందరూ అనుకుంటారు కానీ ఇది అపోహ. మినరల్ వాటర్ ని కూడా సాధారణ నీటి లాగానే వేడి చేయవు దాని వలన అందులో ఉండే పోషకాలు ఏవి బయటికి పోవు. అలాగే అదే నీటిని మళ్ళీ మళ్ళీ వేడి చేయవచ్చా అంటే చేయవచ్చని చెప్తున్నారు నిపుణులు.