ఒంటి కొవ్వును తగ్గించుకునే.. వంటింటి చిట్కాలు..
కరోనా భయంతో నెలల తరబడి ఇంట్లోనే బంధింపబడి ప్రాణాలు విసిగిపోతున్నాయి. బైటికి వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నా.. రుచికరమైన ఆహారం కోసం నాలుక వెంపర్లాడుతోంది. కరోనా కాలం శరీరంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. అనార్గనైజ్ వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శరీరాన్ని ఓ దారిలో పెట్టాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.
కరోనా భయంతో నెలల తరబడి ఇంట్లోనే బంధింపబడి ప్రాణాలు విసిగిపోతున్నాయి. బైటికి వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నా.. రుచికరమైన ఆహారం కోసం నాలుక వెంపర్లాడుతోంది. కరోనా కాలం శరీరంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. అనార్గనైజ్ వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శరీరాన్ని ఓ దారిలో పెట్టాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.
రోజూ ఉదయాన్నే గ్లాసు వేడి నీటిలో తేనె కలుపుకుని తాగాలి. ఇది మెటబాలిజాన్ని పెంచడమే కాకుండా బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సాయపడుతుంది.
తెల్లటి అన్నానికి బదులుగా, బ్రౌన్ రైస్, డహ్లియా, వోట్స్ తినడం అలవాటు చేసుకోండి.
మీ ఆహారంలో చక్కెరను పూర్తిగా మానేయండి. ముఖ్యంగా స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీంలు తినడం పూర్తిగా మానేయాలి.
అధిక కొవ్వు ఉన్న ఆహారం, శీతల పానీయాలు పొట్టభాగంలో, తొడల భాగంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. ఇలాంటి ఆహారపదార్థాలు తినే జాబితాలో ఉండకపోవడమే మంచిది.
శరీర జీవక్రియను పెంచడానికి, రక్తంలో విషపదార్థాలను తొలగించడానికి నీరు సహాయపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా సరైన మొత్తంలో నీరు తాగుతుండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు.
దాల్చిన చెక్క, అల్లం, నల్ల మిరియాలతో కాస్త ఉప్పు ఉప్పుగా ఉండే ఆహారాన్ని తినండి. ఈ రకమైన మసాలా మీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తుంది.
రోజూ ఉదయం పూట పడిగడపున రెండు లవంగాలు, వెల్లుల్లి రెబ్బలను కచపిచా నమిలేయండి. ఆ తరువాత నిమ్మరసం, తేనె కలిపిన వేడినీళ్లు తాగండి. దీనివల్ల శరీరంలో రక్త ప్రవాహం చురుకుగా ఉంటుంది.
ముఖ్యంగా క్రమం తప్పని నడక, ప్రాణాయామం, సూర్య నమస్కారం వంటి కొన్ని వ్యాయామాలు చేసే అలవాటు చేసుకోవాలి.