MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • కారం ఎక్కువగా తింటరా.. మీకు ఈ సమస్యలు రావడం గ్యారంటీ..!

కారం ఎక్కువగా తింటరా.. మీకు ఈ సమస్యలు రావడం గ్యారంటీ..!

కొంతమంది కారాన్ని మరీ ఎక్కువగా తినేస్తుంటారు. ముఖ్యంగా ఎండు మిరపపొడిని. కానీ దీన్ని మరీ ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.  

2 Min read
Author : R Shivallela
Published : Sep 22 2023, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చాలా మంది స్పైసీ ఫుడ్ ను బాగా ఇష్టపడతారు. కానీ రెగ్యులర్ గా ఎండుమిర్చి పొడిని ఎక్కువగా  తీసుకోవడం ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపులో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇది ప్రాణాల మీదికి కూడా తెస్తుంది. ఎర్ర మిరపకాయలలో అఫ్లాటాక్సిన్ ఉంటుంది. ఇది కొన్ని కొన్ని సార్లు కడుపు పూతలు, లివర్ సిర్రోసిస్, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అసలు ఎర్రమిరపకాయల పొడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

గ్యాస్ట్రిక్ సమస్యలు

ప్రస్తుత కాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే దీన్ని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కడుపు లోపలి పొర చికాకు కలుగుతుంది. ఇది గ్యాస్ట్రైటిస్ లేదా గ్యాస్ట్రిక్ అల్సర్లకు దారితీస్తుంది. ఇది కడుపు నొప్పి, మంట, అసౌకర్యం వంటి సమస్యలను కలిగిస్తుంది. 

36

జీర్ణక్రియ సమస్య

కారంగా ఉండే కారం పొడి వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల విరేచనాల సమస్య వస్తుంది. ముఖ్యంగా ఎండుమిరపపొడి ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (ఐబిఎస్) లేదా ఇతర జీర్ణశయాంతర సమస్యలు ఉన్నవారికి అస్సలు మంచిది కాదు. 
 

46

రక్తపోటు పెరగడం

మిరపపొడిలో ఉండే క్యాప్సైసిన్ ఒత్తిడి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. దీంతో మీ రక్తపోటు బాగా పెరుగుతుంది. అధిక రక్తపోటు పేషెంట్లకు, గుండె జబ్బుల ప్రమాదం ఉన్నవారికి ఎర్ర కారం పొడి మంచిది కాదు. ఇది ప్రమాదకరం. ఎందుకంటే ఇది ఈ సమస్యలను మరింత పెంచుతుంది. 

56

శ్లేష్మ పొరలకు నష్టం

కారంలో ఉండే క్యాప్సైసిన్ మన గొంతు, నోరు, శ్వాసకోశ వ్యవస్థలోని శ్లేష్మ పొరలను చికాకు పెడుతుంది. అలాగే వాపునకు దారితీస్తుంది. రోజూ మిరపపొడిని అతిగా తీసుకోవడం వల్ల మీకు శ్వాసకోశ సమస్యలు,  దగ్గు వచ్చే ప్రమాదం ఉంది. 

66
Image: Freepik

Image: Freepik

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ 

ఎండుమిర్చి పొడి దిగువ అన్నవాహిక స్పింక్టర్ ను సడలించగలదు. దీనివల్ల కడుపు ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వస్తుంది. ఇది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ కు దారితీస్తుంది. 
  
 

About the Author

RS
R Shivallela
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamarind Water: రోజూ చింతపండు రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా? శరీరంలో వచ్చే మార్పులివే!
Recommended image2
Hyderabad: మెంట‌ల్ హెల్త్‌ బాగుంటేనే ఆరోగ్యంగా ఉన్న‌ట్లు.. అవి కూడా అనారోగ్య స‌మ‌స్య‌లే
Recommended image3
Fertility Crisis: ప్రమాదంలో మానవ జాతి? భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కష్టమే.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved