Walking: ఈ టైంలో వాకింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?
చాలామంది రెగ్యులర్ గా వాకింగ్ చేస్తుంటారు. కాసేపు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత రెండూ మన సొంతం. అయితే వాకింగ్ ఏ టైంలో చేస్తే హెల్త్ కి మంచిదో మీకు తెలుసా? సరైన టైంలో వాకింగ్ చేయడం వల్ల శరీరానికి 9 రకాలుగా మేలు జరుగుతుందటా.
- FB
- TW
- Linkdin
Follow Us
)
వాకింగ్ చాలా సులువైన వ్యాయామం. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చాలా మంది ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు కాసేపు వాకింగ్ చేస్తుంటారు. కానీ పర్టిక్యులర్ టైంలో వాకింగ్ చేయడం ద్వారా శరీరానికి 9 రకాల ప్రయోజనాలు చేకూరుతాయి అంటున్నారు నిపుణులు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం:
భోజనం తర్వాత మితంగా వాకింగ్ చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంచి రక్త ప్రసరణ వల్ల గుండె పనితీరు బాగుంటుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
మంచి నిద్ర:
ప్రతిరోజూ భోజనం తర్వాత వాకింగ్ చేయడం వల్ల శరీర జీవ గడియారం బాగా పనిచేస్తుంది. దీనివల్ల నిద్ర చక్రం మెరుగుపడుతుంది. రాత్రిపూట గాఢ నిద్ర వస్తుంది. మంచి నిద్ర శరీరంలోని అనేక వ్యాధులను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. మెదడు బాగా పనిచేసి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
మానసిక ఒత్తిడి:
వాకింగ్ చేయడం వల్ల మానసిక స్థితిని మెరుగుపరిచే హార్మోన్లు విడుదలవుతాయి. శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల కావడం వల్ల మానసిక స్థితి స్థిరంగా ఉండి, ఆందోళన తగ్గుతుంది. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
శక్తి స్థాయిలు పెరుగుతాయి:
భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే శరీరమంతా రక్త ప్రసరణ, ఆక్సిజన్ మార్పిడిని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. శరీర శక్తి స్థాయిలు పెరగడం వల్ల ఎక్కువ అప్రమత్తతతో పని చేయగలుగుతారు
పేగు ఆరోగ్యం:
భోజనం తర్వాత నడవడం వల్ల పేగుల్లో ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు పనిచేయడానికి అనుకూలంగా ఉంటుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు మద్దతు ఇవ్వడానికి భోజనం తర్వాత వాకింగ్ సహాయపడుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
వాకింగ్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. కడుపులో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన జీర్ణ ఎంజైమ్లను ఎక్కువగా స్రవించడానికి సహాయపడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, వాపు లాంటి సమస్యలు రావు. మలబద్ధకం రాకుండా ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు:
భోజనం తర్వాత నడవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు లేదా వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నవారు తప్పనిసరిగా భోజనం చేసిన వెంటనే నడవాలి. కనీసం 10 నిమిషాలు నడిస్తే మంచిది.
మెదడు పనితీరు:
భోజనం చేసిన వెంటనే కొద్దిసేపు నడిస్తే మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల సృజనాత్మకత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే మనశ్శాంతి లభిస్తుంది. దీనివల్ల సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది.
బరువు తగ్గడం:
భోజనం తర్వాత నడవడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. మూడు పూటలా భోజనం తర్వాత నడిస్తే త్వరగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే భోజనం తర్వాత నడవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. దీనివల్ల తినే ఆహారం కొవ్వుగా నిల్వ అవ్వకుండా ఉంటుంది. బరువును నియంత్రణలో ఉంచుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ఊబకాయం లాంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.