MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Food
  • దగ్గు, జలుబు ఉన్నప్పుడు పండ్లను తినొచ్చా?

దగ్గు, జలుబు ఉన్నప్పుడు పండ్లను తినొచ్చా?

చలికాలంలో దగ్గు, జలుబు, గొంతునొప్పి, వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. ఇలాంటి సమస్యలున్నప్పుడు ఏవీ తినాలనిపించదు. అయితే ఈ సమయంలో పండ్లను తినొచ్చా? లేదా? అన్న అనుమానాలు చాలా మందికి ఉంటాయి.   

2 Min read
Shivaleela Rajamoni
Published : Dec 13 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
పండ్లు

పండ్లు

చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఈ సీజన్ లో పెరిగిపోతుంది. కానీ దగ్గు, జలులు సమస్యలు అంత తొందరగా తగ్గవు. అంతేకాదు ఈ సీజన్ లో ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. అందుకే వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. ఏదేమైనా ఈ సమస్యలు మరీ ఎక్కువ కాకుండాచూసుకోవడం మంచిది. 
 

26
fruits

fruits

దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు ఉన్నప్పుడు పండ్లును తినొచ్చా? లేదా?అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. నిజానికి పండ్లను తినడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనకున్న ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయితే దగ్గు, జలుబు ఉన్నప్పుడు పండ్లు తింటే కొందరికి దగ్గు, గొంతునొప్పి పెరుగుతాయి. అందుకే ఇలాంటి కొన్ని సమస్యలున్నప్పుడు వీటిని తినకూడని చాలా మంది అంటుంటారు. 

36
fruits

fruits

అయితే దగ్గు, జలుబు ఉన్నప్పుడు పండ్లను తినకూడదు అనడానికి స్పష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే పండ్లు తింటే అందరికీ ఒకేలా ఉండదనేది వాస్తవం. నారింజ, కివీలు, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు లేదా కొద్దిగా ఆమ్ల పండ్లు కొంతమందికి గొంతు నొప్పిని, దగ్గును కలిగిస్తాయి. కానీ చాలా మందికి పెద్దగా ఇబ్బందిని కలిగించవు. 
 

46
పండ్లు

పండ్లు

అలాగే ఫ్రిజ్ లో ఉంచిన పండ్లను లేదా జ్యూస్ లను తాగితే కూడా దగ్గు, జలుబు సమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే పండ్లను గానీ, పండ్ల రసాలను గానీ వీలైనంత వరకు గది ఉష్ణోగ్రత వద్దే తీసుకోవాలి. మీకు సిట్రస్ పండ్ల వల్ల ఇబ్బంది కలిగితే ఈ సమయంలో వాటిని తీసుకోకపోవడమే మంచిది. 
 

56
పండ్లు

పండ్లు

మీకు దగ్గు, జలుబు ఉన్నప్పుడు, గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పండ్లను, ముఖ్యంగా ఆమ్లరహిత పండ్లను ఎక్కువగా తినడం మంచిది. ఇతర వేరే సమస్యలేం లేకపోతే ఏ పండు అయినా తినొచ్చు. పండ్లు తినడం వల్ల శరీరానికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. 
 

66
పండ్లు

పండ్లు

అలాగని వీటిని మరీ ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే  పండ్లలో కూడా నేచురల్ షుగర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ తీపిని అతిగా తినడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే. ఏదేమైనా.. డాక్టర్ సలహా తీసుకుని వాటిని పాటించడం మర్చిపోకండి. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
ఆహారం
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved