Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు
food-life Jul 25 2026
Author: ramya Sridhar Image Credits:Instagram
Telugu
నీర్ దోశ బాగా రావాలంటే ఈ చిట్కా తప్పనిసరి..
నీర్ దోశలు మెత్తగా రావాలంటే.. పిండి మెత్తగా రావాలి. ఇలా పిండి మెత్తగా సాఫ్ట్ గా రావాలి అంటే.. కనీసం బియ్యాన్ని 4 నుంచి 5 గంటల పాటు నానపెట్టాలి. అప్పుడు దోశలు కూడా మెత్తగా వస్తాయి
Image credits: Instagram
Telugu
సన్న బియ్యం వాడండి
మరీ మెత్తగా ఉండే నీర్ దోసెలు కావాలంటే సోనా మసూరి లేదా ఇతర సన్న రకం (Short-grain) బియ్యాన్ని ఉపయోగించడం చాలా మంచిది.
Image credits: Instagram
Telugu
పిండిని మెత్తగా రుబ్బుకోవాలి
పిండి పాలులా పల్చగా, పూర్తి నున్నగా ఉండాలి. పిండిలో రవ్వ ఉంటే జల్లెడలాంటి నీర్ దోసెలు వేయడం అస్సలు కుదరదు.
Image credits: Instagram@vinaysathyam
Telugu
పిండిని అస్సలు రుద్దొద్దు
సాధారణ దోసెలా గరిటెతో పిండిని రుద్ది, స్ప్రెడ్ చేయొద్దు. దానికి బదులుగా, పెనంపై గుండ్రంగా పిండిని పోయాలి. అదే దానంతట అదే పరుచుకుంటుంది.
Image credits: Instagram@youreverydaycook
Telugu
మూత పెట్టి ఉడికించాలి
పెనంపై పిండి పోసిన వెంటనే దోసెపై మూత పెట్టాలి. నీర్ దోసెను ఆవిరి మీదే ఉడకనివ్వాలి. ఇలా చేస్తే..నీర్ దోశలు చాలా మెత్తగా వస్తాయి.