MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఎండపెట్టే పనిలేకుండా వడియాలు ఎలా చేయాలో మీకు తెలుసా?

ఎండపెట్టే పనిలేకుండా వడియాలు ఎలా చేయాలో మీకు తెలుసా?

ఇంట్లోనే పెద్దగా శ్రమ లేకుండా.. కనీసం ఎండపెట్టే పనికూడా లేకుండా.. వడియాలు తయారు చేసుకోవచ్చు. రుచికి రుచి అందించడమే కాకుండా.. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాంటి పేపర్ వడియాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : May 20 2024, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వడియాలు, అప్పడాలు ఇష్టపడనివారు ఎవరు ఉంటారు..? పప్పు, చారు లాంటి కూరలతో భోజనం చేసే సమయంలో సైడ్ డిష్ గా  వడియాలు ఉంటే.. ఆ రుచే వేరు.  చిన్న పిల్లలు సైతం వాటిని ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ... వాటిని చేసుకోవడం పెద్ద శ్రమ.. ఈ అపార్టెంట్ సంస్కృతిలో... వడియాలు ఎండపెట్టుకునే అంత ప్లేస్ కూడా ఉంటుందా అని కొందరు వాటి జోలికి పోవడం లేదు. మరి కొందరు... వాటి మీద ఇష్టం చంపుకోలేక మార్కెట్లో దొరికేవి తెచ్చుకొని కొనుక్కుంటూ ఉంటారు. కానీ మార్కెట్లో దొరికేవి మనం చేసుకున్నంత టేస్ట్, శుభ్రత ఉండకపోవచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలాంటివారు.. ఇంట్లోనే పెద్దగా శ్రమ లేకుండా.. కనీసం ఎండపెట్టే పనికూడా లేకుండా.. వడియాలు తయారు చేసుకోవచ్చు. రుచికి రుచి అందించడమే కాకుండా.. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాంటి పేపర్ వడియాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...
 

36

ముందుగా.. ఈ వడియాలు తయారు చేయడానికి మనకు సగ్గు బియ్యం ఉంటే సరిపోతుంది. ఆ సగ్గు బియ్యంతోనే ఈ వడియాలను తయారు చేస్తాం. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే... దానికి ఆరు కప్పుల నీరు అవసరం అవుతాయి.
 

46
papadam

papadam

papadamముందుగా సగ్గు బియ్యం కప్పు తీసుకొని.. కనీసం రెండు గంటల పాటు నానపెట్టాలి. ఆ తర్వాత.. ఆరు కప్పుల నీటిని తీసుకొని నీటిని మరగనివ్వాలి. నీరు మరిగిన తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసి... అందులో కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు... ఆ నీటిలో.. ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యం తీసి.. ఈ మరిగించిన నీటిలో వేయాలి.  దాదాపు 10 గంటలపాటు.. ఈ నీటిలో వాటిని నాననివ్వాలి.

56

మంచిగా నానాయి అనుకున్న తర్వాత... వాటిని మిక్సీ జార్ లో వేసి.. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇఫ్పుడు... ఇంట్లో మీకు అందుబాటులో ఉండే.. ఏదైనా పాత చీర, లేదంటే.. ప్లాస్టిక్ కవర్ మీద వడియాల్లాగా పోసుకోవాలి.

66

మొత్తం పిండి అలా పెట్టుకున్న తర్వాత.. మీరు ఇంట్లో ఫ్యాన్స్ కి కింద.. రెండు, మూడు గంటలు ఆరనిస్తే సరిపోతుంది. చాలా త్వరగా ఆరిపోతాయి.  మనకు నచ్చిన సమయంలో నూనెలో వేయించుకొని .. కమ్మగా ఆరగించడమే. నోట్లో పెట్టుకుంటే చాలు కరిగిపోతాయి. టేస్ట్ మాత్రమే కాదు.. ఇంట్లో, సగ్గు బియ్యంతో చేసినవి కావడంతో.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chia Seeds: నీళ్లలో కలిపి కాకుండా.. పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Peanuts: రోజూ పల్లీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image3
Chicken Ghee Roast: నోరూరించే మంగళూరు స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..అద్భుతః
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved