MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఈ పండ్లను పరిగడుపున తింటే ఎంత మంచిదో..!

ఈ పండ్లను పరిగడుపున తింటే ఎంత మంచిదో..!

పండ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. అయితే కొన్ని రకాల పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ముఖ్యంగా ఉదయం. అయితే కొన్ని రకాల పండ్లను ఉదయం పరిగడుపునే తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అవి ఏయే పండ్లంటే..

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 23 2023, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనం తినే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. అయితే ఫుడ్ ను తినడానికి ఒక నిర్ధిష్ట సమయం ఉంటుంది. అలాగే వాటిని ఎలా తినాలి? ఎలా తినకూడదు అనే నియమాలు కూడా ఉంటాయి. అయితే ఉదయాన్నే కొన్నిరకాల పండ్లను పరగడుపున తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్లు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఇంతకీ ఆ పండ్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

25

పుచ్చకాయ

పుచ్చకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఉదయాన్నే పుచ్చకాయ పండును తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన ద్రవాలు అందుతాయి. అలాగే డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం తగ్గుతుంది. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పుచ్చకాయ శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 

35
papaya

papaya

బొప్పాయి

బొప్పాయి పండును కూడా ఉదయం పరిగడుపున తినొచ్చు. ఉదయాన్నే పరిగడుపున బొప్పాయి పండును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీన్ని తింటే మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే బొప్పాయిని డైట్ లో చేర్చుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండులో  కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
 

45

ఆపిల్

ఆపిల్ పండును కూడా మార్నింగ్ పరిగడుపునే తినొచ్చు. ఫైబర్, సహజ  చక్కెరలు పుష్కలంగా ఉండే ఆపిల్ పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఈ పండు మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. 
 

55

కివీ

కివీ పండ్లు విటమిన్ సి కి అద్బుతమైన వనరులు. ఈ పండ్లను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే పరగడుపున కివీలను తినడం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cashew Apples: జీడి పండ్లు ఎక్కడ కనిపించినా కొని తినండి, దీని వల్ల మీరు ఊహించని లాభాలు
Recommended image2
Soft Roti: పిండి ఇలా కలిపితే... చపాతీలు మెత్తగా వస్తాయి..!
Recommended image3
Brain Food: ఈ సూపర్ ఫుడ్స్ తో వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved