MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఈ పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది జాగ్రత్త

ఈ పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది జాగ్రత్త

డయాబెటీస్ పేషెంట్లు కొన్ని రకాల పండ్లను అస్సలు తినకూడదు. ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 27 2025, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పుచ్చకాయ
Image Credit : Getty

పుచ్చకాయ

పుచ్చకాయ మంచి హెల్తీ ఫుడ్, దీనిలో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. కానీ ఈ పండును షుగర్ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే ఈ పండులో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండును డయాబెటీస్ ఉన్నవారు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి. 

27
పైనాపిల్
Image Credit : stockPhoto

పైనాపిల్

పైనాపిల్ పండులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో నేచురల్ షుగర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. అందుకే ఈ పండును డయాబెటీస్ పేషెంట్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తారు. 

37
అరటిపండు
Image Credit : Getty

అరటిపండు

అరటి మంచి హెల్తీ పండు. కానీ ఈ పండులో కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ 52 ఉంటుంది. ఈ పండును తింటే డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అందుకే ఈ పండును డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువగా తినకూడదు. 

47
మామిడి పండు
Image Credit : stockPhoto

మామిడి పండు

చాలా మంది మామిడి పండును చాలా ఇష్టంగా తింటారు. కానీ ఈ పండులో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి. 

57
ద్రాక్ష
Image Credit : Pixabay

ద్రాక్ష

ద్రాక్షలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో షుగర్ కూడా ఎక్కువగానే ఉంటుది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ద్రాక్షలను ఎక్కువగా తినకూడదు. 

67
చెర్రీలు
Image Credit : Freepik

చెర్రీలు

చెర్రీలు టేస్టీగా ఉంటాయి. కానీ ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని డయాబెటీస్ పేషెంట్లకు తినకూడదు. ఒకవేళ తింటే రక్తంటో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి. 

77
ఎండుద్రాక్ష
Image Credit : stockPhoto

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 64 ఉంటుంది.  అంటే వీటిలో నేచురల్ షుగర్స్ బాగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఎండుద్రాక్షల్ని ఎక్కువగా తినకూడదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Onion: ఇలా చేస్తే..ఉల్లిపాయ కోసినా కళ్లల్లో నుంచి నీళ్లు రావు
Recommended image2
Cinnamon Water: పరగడుపున దాల్చిన చెక్క నీరు తాగితే ఏమౌతుంది?
Recommended image3
Poori Tips: పూరీలు బాగా పొంగాలంటే ఏం చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved