MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చికెన్, మటన్ తో పెరుగును తింటే ఏమౌతుందో తెలుసా?

చికెన్, మటన్ తో పెరుగును తింటే ఏమౌతుందో తెలుసా?

పెరుగు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ కొన్ని రకాల ఆహారాలతో పెరుగును అస్సలు తినకూడదు. అవేంటో తెలుసా? 

2 Min read
Shivaleela Rajamoni
Published : Sep 19 2024, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పెరుగు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, విటమిన్ బి 12 వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పెరుగును కొన్ని ఆహారాలతో మాత్రం అస్సలు తినకూడదు. 

26

పిల్లల నుంచి పెద్దల వరకు పెరుగును ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కొంతమంది కూరలు లేకున్నా పెరుగుతో తింటుంటారు. పోషకాలు మెండుగా ఉండే పెరుగు మన ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలాగే కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక అలసటను ఎదుర్కోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. పెరుగులో ప్రోబాటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. పెరుగును తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా తొందరగా జీర్ణమవుతుంది. 

పెరుగు మన ఆరోగ్యానికి ఎంతటి మేలు చేసినా.. దీనిని కొన్ని ఆహారాలతో అస్సలు తినకూడదు. ఒకవేల తింటే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

36

మామిడి

మామిడి పండ్లను ఎప్పుడూ కూడా పెరుగుతో కలిపి తినకూడదు. పెరుగులో చలువ చేసే గుణం ఉంటుంది. ఇక మామిడి పండ్లు వేడి చేస్తాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి తింటే కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలతో పాటుగా మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

అరటి

అరటి పండ్లను తినేటప్పుడు కూడా మీరు పెరుగును తినకూడదు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి అరటిపండ్లను  కొంతమంది ఎక్కువగా తింటుంటారు. కానీ ఇవి తిన్న వెంటనే మీరు పెరుగును తీసుకుంటే కడుపులో జీర్ణశక్తి మందగిస్తుంది. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది. 
 

46
yogurt

yogurt

మాంసాలు:

చికెన్, మటన్ వంటి మాంసాలను తిన్న తర్వాత చాలా మంది చివర్లో పెరుగును ఖచ్చితంగా తింటుంటారు. కానీ మాంసంతో పెరుగును అస్సలు తినకూడదు. ఎందుకంటే మాంసంలో ప్రోటీన్, పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. 
 

56

కీర దోసకాయ

కీరదోసకాయను కూడా ఎట్టి పరిస్థితిలో పెరుగుతో కలిపి తినకూడదు. ఎందుకంటే ఈ రెండూ జలుబు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తింటే మీకు దగ్గు, జలుబు, సైనస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. 

66


అలాగే  పెరుగును పాలు, ఉల్లిపాయలు, వేయించిన ఆహారాలు, గింజలు, జున్ను మొదలైన వాటితో కూడా తినకూడదు. దీనివల్ల మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండండి. అలాగే పెరుగును అతిగా కూడా తినకూడదు. అలాగే మధ్యాహ్నం పెరుగు తింటే చాలా మంచిది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved