MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss telugu 8: బిగ్ బాస్ హౌస్ లో లో బోరుమని ఏడ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే...?

Bigg Boss telugu 8: బిగ్ బాస్ హౌస్ లో లో బోరుమని ఏడ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే...?

బిగ్ బాస్ అంటేనే ఎమోషన్.. సెంటిమెంట్.. అగ్రెస్సీవ్.. గేమ్..సెలబ్రేషన్.. ఇలా నవరసాలు.. కలగలిసిన బిగ్ బాస్ లో.. ఏ ఎమోషన్ ను ఆపుకోలేక..బోరున ఏడ్చి తమ ఫీలింగ్స్ ను వెల్లడించిన కంటెస్టెంట్ చాలా మంది ఉన్నారు. అందులో తెలగు బిగ్ బాస్ నుంచి  కొంత మంది గురించి తెలుసుకుందాం.. బోరున ఏడ్చివారు ఎవరు.. ఎందుకు ఏడ్చారు.. కారణమేంటో తెలుసుకుందాం..?  

3 Min read
Mahesh Jujjuri
Published : Aug 31 2024, 09:19 AM IST| Updated : Aug 31 2024, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఎవరో ఒకరు వీక్ కంటెస్టెంట్స్ ఉంటారు.. సమయం వచ్చినప్పుడు వారిలో ఉన్న ఎమోషన్ బయటకు వస్తుంది.. ఏడుస్తూ.. తమ నిస్సహాయతను వెల్లడిస్తుంటారు. ఇక ఇంటి నుంచి బయటకు పంపించమని ఏడ్చిన కంటెస్టెంట్స్ లో ముందుగా గుర్తుకు వచ్చేది సంపూర్ణేష్ బాబు పేరు. హౌస్ లోకి వచ్చిన వారం పదిరోలు బాగానే ఉన్న సంపూ.. ఆతరువాత ఉండలేకపోయాడు. ఫస్ట్ సీజన్ తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంపూ.. తను తనవారిని చూడకుండా ఉండలేనంటూ.. మానసికంగా ఇబ్బందిపడ్డాడు. బోరున ఏడ్చి బయటకు పంపించమని వేడుకున్నాడు. దాంతో బిగ్ బాస్ టీమ్ సంపూను బయటకు పంపించేసింది. 

బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని కెమెరాలు ఉంటాయి..? ఆ ఒక్క ప్లేస్ లో మాత్రం ఎందుకు పెట్టరు...?
 

26

ఇక అదే సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన సింగర్ మధు ప్రియాది కూడా ఇదే పరిస్థితి.. తాను ఉండలేనంటూ.. చాలారోజులు ఏడ్చుకుంటూ కూర్చుంది. కాని అక్కడ ఉన్నవారు సర్దిచెప్పడంతో.. తనను తాను కంట్రోల్ చేసుకుంది. కాని మధుప్రియ బాగా ఏడ్వడం వల్లే ఆతరువాత ఆమెను నామినేట్ చేసి.. ఎలిమినేషన్ ప్రక్రియలో బయటకు పంపించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే సీజన్ లో మాటిమాటికి ఏదో ఒక్క విషయంలో ఏడుస్తూ.. విసుగు తెప్పించాడు జబర్థస్త్ స్టార్ కమెడియన్ ధనరాజ్. అతను హౌస్ లో ఉండి ఎంత నవ్వించాడో.. అంతా ఏడుస్తూనే ఉన్నాడు. 

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ప్రెగ్నెంట్ అయితే ..? ఓ సారి ఏం జరిగిదంటే..?
 

36

నిజానికి ఇక బిగ్ బాస్ అన్ని సీజన్లలో కంటెస్టెంట్స్ ఎమోషనల్ అవుతు ఏదో ఒక సందర్భంలో కన్నీళ్ళు పెట్టినవారే. కాని హౌస్ లో బాగా ఎక్కువగా ఏడ్చినవారు మాత్రం స్పెషల్ గా ఆడియన్స్ లో రిజిస్టర్ అయ్యారు. అటువటివారిలో శివజ్యోజి కూడా ఒకరు.  సీజన్ 3 లో తీన్ మార్ సావిత్రి.. అలియాస్ శివజ్యోతి కూడా బిగ్ బాస్ లో ఉన్నంత సేపు చిన్న విషయానికే ఎమోషనల్ అయ్యి బోరున ఏడ్చేది. ఎవరికి బాధ కలిగినా.. తనతోపాట్.. ఇతరులకు సబంధించిన ఏదైనా ఎమోషనల్ మూమెంట్ వచ్చినా.. శివజ్యోతిబోరున ఏడ్చేది.  ఏడ్చేది.  
 

బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ క్రికెటర్.. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..? ఎవరతను..?

46

ఇక ప్రతీ సీజన్ లో ఇలా బాగా ఏడ్చేవారు లేకపోలేదు. బిగ్ బాస్ సీజన్ 5 లో బాగా ఎమోషనల్ అయిన వారిలో ప్రియాంకసింగ్  టాప్ లో ఉన్నారు. ఆమె బిగ్ బాస్ సీజన్ 5 లో ఎక్కువగా ఏడ్చిన పర్సన్ గా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మానస్ తో తన రిలేషన్ విషయంలో బాగా బాధపడుతూ.. ఏడుస్తూ కనిపించిన ప్రియాంకసింగ్.. తన తండ్రికి తాను ట్రాన్స్ జెండర్ అని  బిగ్ బాస్ ద్వారా తెలిసి.. ఆయన యాక్సప్ట్ చేసిన తరువాత ఏడుపు ఆపుకోలేకపోయింది ప్రియాంక. తన తండ్రి వీడియోను చూసి బోరున ఏడ్చింది. 

56
Keerthi bhat

Keerthi bhat

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో ఎక్కువగా ఎమోషనల్ అయ్యి ఏడ్చిన వారిలో కీర్తి భట్ ముందుంది. ఆమె తన గతం తలుచుకుని చాలా సార్లు బోరున విలపించింది. అంతే కాదు హౌస్ లో ఎక్కువగా గాయపడింది కూడా ఆమె. చాలా సార్లు ఆమె ఏడుస్తూ కనిపించింది. ఇక హౌస్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండి.. చివరకు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ.. గీతూ రాయల్ కూడా ఎక్కువగా ఏడ్చేసింది. ఆమె అలా ఏడ్చేవరకూ అంతా షాక్ అయ్యారు. 

66

ఇక లాస్ట్ ఇయర్ జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 లో బాగా ఎమోషనల్ పర్సన్ అంటే.. అమర్ దీప్ తో  పాటు పల్లవి ప్రశాంత్ పేర్లు చెప్పవచ్చు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అయితే చాలా సందర్భాల్లో బోరున విలపించాడు. తన పరిస్థితి  గురించి చెపుతూ.. సింపతీ కార్డ్ ను బాగా ఉపయెగించుకున్నాడు. అనుకున్నట్టుగానే విన్నర్ గా బయటపడ్డాడు. అయితే అతని ఏడుపు చాలా విమర్శలకు దారి తీసింది. విన్నర్ అయిన తరువాత కూడా చాలా కాంట్రవర్సీలలో అతను చిక్కుకోవడం జరిగింది. ఇలా బిగ్ బాస్ లో చాలామంది  తమ ఎమోన్స్ ను ఆపుకోలేక బోరున విలపించిన వారు ఉన్నారు. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved