Intinti gruhalakshmi: ప్రాజెక్ట్ని ఒప్పుకున్న క్లైంట్... పరంధామయ్యకి గుండెనొప్పి... కంగారులో తులసి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... క్లైంట్ సామ్రాట్ కి ఫోన్ చేసి తులసి గారి ప్రాజెక్ట్ వివరణ మాకు బాగా నచ్చింది. మనం ఈ ప్రాజెక్ట్ ని కలిసి చేస్తున్నాము అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అప్పుడు సామ్రాట్, తులసి గారు బాగా చెప్పారట మన క్లైంట్ మనతో కలిసి పని చేయడానికి ఒప్పుకున్నారు అని నందు,లాస్య లతో చెప్తాడు. లాస్య నందులు ఆశ్చర్యపోతారు. వెంటనే తులసి గారి దగ్గరికి వెళ్లి క్షమాపణ అడుగుదాము అని సామ్రాట్ తులసి దగ్గరికి వెళ్తాడు. అక్కడ తులసి బాధపడుతూ ఉంటుంది.సారీ తులసి గారు క్లైంట్ మన ప్రాజెక్ట్ ని ఒప్పుకున్నారు అని అంటారు.
ఒప్పుకున్నారు కాబట్టి మీరు నాకు క్షమాపణ చెప్తున్నారు లేకపోతే కథ ఇంకోలా ఉండేది కదా? నేను నిజంగానే మిమ్మల్ని నా సాయి శక్తుల లేపడానికి ప్రయత్నించాను, మీరు లెగకపోతే అది నా తప్పుకాదు, అయినా సరే నన్ను అంటున్నారు అని అనగా సామ్రాట్, బాస్ కూడా తప్పులు చేస్తారండి. ప్రతిసారి సరిగ్గా ఉండడానికి మేము మనుషులమే కదా, ఇకనుంచి ఏ పనైనా సరే మీకు నచ్చితే మీరు చేయండి దాని ఫలితం మంచిదైనా చెడ్డదైనా మీకు నచ్చిందంటే చేయండి.నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో ఇంట్లో అనసూయ పరంధామయ్యకి కాఫీ పెట్టి ఇస్తుంది.
అప్పుడు పరంధామయ్య నవ్వుతూ మీ నానమ్మ పనిచేయడానికి ఒళ్ళు బద్ధకం కానీ చేస్తే గుటకలేసుకొని మనం తినొచ్చు అని అంటాడు. అప్పుడు అనసూయ పరంధామయ్య ని తిడుతుంది. అలాగా ఇంట్లో వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా పరంధామయ్యకి గుండె నొప్పి వస్తుంది.అందరూ భయపడి మంచినీళ్లు తెచ్చి గుండె రుద్దుతారు.ఈలోగ అభి, మీరేమీ భయపడొద్దు నానమ్మ నేను వెళ్లి టెస్టులన్నీ చేసుకుని వస్తాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో సామ్రాట్ నిన్ను రాత్రి తాగి ఏమైనా జరిగిందా అసలేమీ గుర్తు రావట్లేదు ఎందుకో అని అనుకుంటాడు.
నందు కూడా నిన్న రాత్రి మాట్లాడకుదనివి ఏమైనా సామ్రాట్ తో మాట్లాడేనా అని అనుకుంటాడు. ఇంతట్లో వాళ్ళిద్దరూ కలిసి నిన్న రాత్రి మనం ఏం మాట్లాడుకున్నాము చాలా ఎక్కువ సేపు మాట్లాడుకున్నట్టు ఉన్నాము కానీ ఏ విషయం గుర్తు రావడం లేదు ఏంటి అని అనుకుంటారు. అప్పుడు సామ్రాట్, బిజినెస్ గురించి ఏమైనా మాట్లాడామ అని అంటాడు సామ్రాట్. తాగిన తర్వాత మనం పని గురించి మాట్లాడే అవకాశం లేదు అని నందు అంటాడు. అప్పుడు ఇంకేం మాట్లాడుకుని ఉంటామో అని సామ్రాట్ అంటాడు.
నందు మనసులో తులసి విషయం, తాగిన మధ్యలో బయటపెట్టేసాన అని భయపడతాడు.అంతట్లో లాస్య అక్కడికి వస్తుంది లాస్య నేను నిన్న ఏం మాట్లాడుకున్నాము అని వాళ్ళ అడగగా తాగిన మత్తులో ఏవో పిచ్చివాగుడు వాగారు అది అనవసరం లెండి అని అంటుంది.ఇంతట్లో ప్రేమ్ తులసికి ఫోన్ చేసి తాతయ్య గారికి గుండెనొప్పి వచ్చింది అమ్మ అని అంటాడు. అప్పుడు తులసి భయపడి నా పని అయిపోయింది నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను ప్రేమని ఫోన్ పెట్టేస్తుంది. సామ్రాట్ దగ్గరికి వెళ్లి మావయ్య గారికి గుండె నొప్పి వచ్చిందట నేను వెంటనే వెళ్ళాలి అని అంటుంది.
పని అయిపొయింది కదా మేము కూడా వచ్చేస్తాము అని అందరూ తిరిగి హైదరాబాద్ కి వచ్చేస్తారు. అప్పుడు తులసి తో పాటు వెనకాతల నందు,లాస్యలు కూడా ఇంటికి వస్తారు.అక్కడ పరంధామయ్య మంచం మీద జారపడి మాట్లాడుతూ ఉంటాడు. తులసి వెంటనే వచ్చి మావయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది అని అనగా గ్యాస్టిక్ అంత గుండెనొప్పి కాదు భయపడాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్ అని అంటారు. పోనీలెండి ఆ దేవుడికి మన మీద జాలి ఉన్నది అని తులసి అంటూ ఇంతకీ అంకిత ఏది అని అంటుం.ది మెడికల్ క్యాంపుకు వెళ్ళింది అని అభి అంటాడు.
మరి వంట ఎవరు చేస్తున్నారు అని తులసి అడగగా మీ అత్తయ్య చేస్తుంది. అందుకే ఈ గుండె నొప్పులు అన్ని వస్తున్నాయి అని నవ్వుతారు.ఇంతట్లో లాస్య మనసులో ఏంటో ఈ ప్రేమలు అస్సలు తట్టుకోలేకపోతున్నాను, కోడలి స్థానం నుంచి వదిలి వెళ్ళిపోయిన వారిని కోడలు కోడలు అంటున్నారు. కోడలునైన నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు అని మనసులో అనుకుంటుంది. ఇంతట్లో శృతి కంగారుగా అక్కడికి వస్తుంది, దివ్య శృతిని చూస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!