- Home
- Entertainment
- Trisha Remuneration: ఒక్క దెబ్బతో డబుల్ అయిన త్రిష రెమ్యూనరేషన్.. కారణం సీఎం అంటూ రచ్చ
Trisha Remuneration: ఒక్క దెబ్బతో డబుల్ అయిన త్రిష రెమ్యూనరేషన్.. కారణం సీఎం అంటూ రచ్చ
Trisha Remuneration: త్రిష ఇప్పుడు హీరోయిన్గానే కాకుండా రాజకీయ పరంగానూ హాట్ టాపిక్ అవుతుంది. అయితే సడెన్గా ఈ అమ్ముడు పారితోషికం పెంచిందట. కారణం సీఎం అంటూ ప్రచారం జరుగుతుంది.

హాట్ టాపిక్ గా మారిన త్రిష
త్రిష ఇప్పుడు మోస్ట్ పాపులర్ హీరోయిన్. తన ఇరవై నాలుగు ఏళ్ల కెరీర్లో ఈ రేంజ్ పాపులారిటీ ఎప్పుడూ రాలేదు. ఇన్నాళ్లు ఆమె పడ్డ కష్టం ఓ ఎత్తైతే, గత రెండు మూడు నెలలుగా ఆమె చుట్టూ జరుగుతున్న ప్రచారం మరో ఎత్తు. దళపతి విజయ్ సీఎం కావడంతో త్రిష క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు సంచలన హీరోయిన్గా మారిపోయింది. ఈ క్రమంలో త్రిషకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె పారితోషికం ఇప్పుడు డబుల్ అయ్యిందట. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

`వర్షం`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష
త్రిష 2002 తమిళ చిత్రం `మౌనం పెసియదే`తో హీరోయిన్గా పరిచయం అయ్యింది. రెండేళ్ల తర్వాత `వర్షం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `అతడు` వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సాధించి, హ్యాట్రిక్ హిట్ కొట్టింది. ఆ తర్వాత `అల్లరి బుల్లోడు`, `పౌర్ణమి`, `స్టాలిన్`, `సైనికుడు`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `కృష్ణ`, `బుజ్జిగాడు`, `శంఖం`, `నమో వెంకటేశా`, `తీన్ మార్`, `బాడీ గార్డ్`, `దమ్ము`, `లయన్`, `చీకటి రాజ్యం` వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె చిరంజీవితో `విశ్వంభర` చిత్రంలో నటించింది. ఇది రిలీజ్ కావాల్సింది. మరోవైపు ఆమె తమిళంలో నటించిన `కరుప్పు`(వీరభద్రుడు) చిత్రం ఈ శుక్రవారం(మే 15)న విడుదల కానుంది.
రజనీ, కమల్ సినిమాలో హీరోయిన్గా త్రిష
నెక్ట్స్ త్రిష చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆమె కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రంలో నటించబోతుందట. వీరిద్దరు హీరోలుగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతుంది. ఆ మధ్య దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇది అదిరిపోయేలా ఉంది. సినిమాపై హైప్ని పెంచింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష ఎంపికైందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్లో, ఇటు టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో ఆమె హీరోయిన్గా కాకుండా కీలక పాత్రలో కనిపించబోతుందని టాక్. త్రిష చేయబోయే పాత్ర చాలా బలంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కోసం త్రిష భారీగా డిమాండ్ చేస్తుందట. మేకర్స్ కూడా గట్టిగానే ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
త్రిష భారీ పారితోషికం
కమల్, రజనీకాంత్ కలిసి నటించబోతున్న ఈ మూవీకి త్రిష ఏకంగా రూ.12కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. మొన్నటి వరకు త్రిషకి ఒక్క సినిమాకి నాలుగైదు కోట్లు ఇచ్చేవారు. సినిమా డిమాండ్ మేరకు ఆరు కోట్ల వరకు ఇచ్చేవారట. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించబోతున్న చిత్రానికిగానూ సుమారుగా పన్నెండు కోట్లు ఇస్తున్నట్టు టాక్. అయితే ఇదంతా ఇప్పుడు ఆమెకి వచ్చిన క్రేజ్ వల్లే అంటున్నారు. దానికి సీఎం కారణమంటున్నారు.
సీఎం వల్లే త్రిష పారితోషికం డబుల్
దలపతి విజయ్ మొన్న తమిళనాడు సీఎం అయ్యాడు. భారీ స్థాయిలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇందులో త్రిష స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. ఆమె ఈవెంట్ కి రావడంతో అభిమానులు అరుపులతో హోరెత్తించారు. దీంతో ఆ ప్రాంగణమంతా ఊగిపోయింది. అయితే త్రిష.. సీఎం విజయ్తో లివింగ్లో ఉన్నారనే వార్తలున్నాయి. ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, త్రిష వల్లే.. విజయ్ భార్య సంగీత.. ఆయనకు విడాకులు ఇస్తుందని అన్నారు. ఆమె పరోక్షంగా ఇదే ఆరోపించింది. దీంతో త్వరలో విజయ్.. త్రిషని పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే విజయ్ సీఎం కావడంతో ఇప్పుడు త్రిషకి క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్ కారణంగానే పారితోషికం పెంచిందని, కమల్, రజనీ సినిమాకి డబుల్ డిమాండ్ చేస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

