సుధీర్-రష్మీ అందరినీ పిచోళ్లను చేస్తున్నారా?
రష్మీ-సుధీర్ ల మధ్య ఉన్న బంధం ఏమిటనేది బుల్లితెర ప్రేక్షకులను వెంటాడుతున్న ప్రశ్న. ఆన్ స్క్రీన్ పై రెచ్చి పోయి ప్రేమించుకునే ఈ జంట ఆఫ్ స్క్రీన్ బంధం ఏమిటనే సందేహం వెంటాడుతుంది. ఐతే వీరు తమ కెరీర్ కోసం ప్రేక్షకులను మభ్య పెడుతున్నారని అర్థం అవుతుంది.
సుధీర్ మరియు రష్మీ బుల్లి తెర హిట్ పెయిర్ గా ఉన్నారు. వీరిద్దరూ కలిసి చేసే ప్రతి షో ప్రేక్షకాదరణ పొందుతుంది. ఆన్ స్క్రీన్ పై వీరి రొమాన్స్ గురించి అందరికీ తెలిసిందే. సుధీర్ రష్మీ అంటే ముచ్చటైన జంటని అందరూ అంటారు.
తెరపై అంతగా రొమాన్స్ పంచుతున్న ఈ జంట మధ్య ఎదో జరుగుతుందని ఎప్పటి నుండో పుకారు. ఇప్పటికి కూడా బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ, సుధీర్ అంటే లవర్స్ అని భవిస్తూ ఉంటారు. అంతగా జనాల్లోకి ఈ జంట వెళ్లిపోయారు.
మరి నిజ జీవితంలో వీరిద్దరూ ప్రేమికులేనా, అందరూ అనుకుంటున్నట్లు ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిమధ్య ఆ సంథింగ్ సంథింగ్ ఉందా అనేది ఎవరికీ తెలియదు.
ఐతే వీరు కేవలం వాళ్ళ కెరీర్ కోసం, వాళ్ళు హోస్టులుగా ఉన్న షోలు సక్సెస్ కావడానికి మాత్రమే అలా తమ మధ్య ఏదో నడుస్తున్న భావన కలిగించారని అర్థం అవుతుంది.
తాజాగా సుధీర్ దీనిపై వివరణ ఇచ్చారు. రష్మీతో తనకు గల రిలేషన్ కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అన్నారు. తన సక్సెస్ కి కారణం రష్మీ అన్నారు. ఆమె తనకు జంటగా చేయడం వలెనే తనకు మంచి అవకాశాలు దక్కినట్లు చెప్పాడు.
ఢీ జోడి షోతో పాటు అనేక ప్రత్యేక కార్యక్రమాలలో వీరు ఘాడమైన ప్రేమికులుగా కనిపించారు. రెగ్యులర్ గా రొమాంటిక్ సాంగ్స్, ఒకటి రెండు సార్లు పెళ్లి కూడా చేసుకున్నారు. ఐతే ఇదంతా కేవలం తమ కెరీర్ కోసం ప్రేక్షకులను పిచ్చి వారిని చేసినట్లు తెలుస్తుంది.
రష్మీ సైతం వీరిద్దరి బంధం గురించి అడిగితే నర్మ గర్భంగా మంచి మిత్రుడు మాత్రమే అన్నారు కానీ, మా బంధం కేవలం బుల్లి తెర షోల కోసమే అని చెప్పలేదు. కాగా ఇంకెత కాలం వీరు ప్రేమికులుగా నటిస్తారో చూడాలి.