- Home
- Entertainment
- K J Yesudas: ఇళయరాజా ఎంత బ్రతిమాలినా నో చెప్పిన యేసుదాస్.. మాస్టర్ పీస్గా నిలిచిన సాంగ్ వెనుక క్రేజీ స్టోరీ
K J Yesudas: ఇళయరాజా ఎంత బ్రతిమాలినా నో చెప్పిన యేసుదాస్.. మాస్టర్ పీస్గా నిలిచిన సాంగ్ వెనుక క్రేజీ స్టోరీ
K J Yesudas: ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీత సారథ్యంలో ఒక పాట పాడటానికి యేసుదాస్కు పిలుపు వచ్చింది. అయితే, కంపోజింగ్కు ఆలస్యంగా వెళ్లిన యేసుదాస్, ఆ పాటను పాడటానికి నిరాకరించి వెనుదిరిగారు. ఏం జరిగిందంటే?
14

Image Credit : X
యేసుదాసు కోసం ఇళయరాజా వెయిటింగ్
తమిళ సినీ సంగీతంలో కొన్ని పాటలు కేవలం స్వరాలు కాదు, అవి ప్రాణం పోసుకుని శ్రోతల భావోద్వేగాలతో కలిసిపోతాయి. అలాంటి ఒక పాట పుట్టుక వెనుక కథ ఇది. ఆ రోజు ఇళయరాజా స్టూడియోలో అంతా సిద్ధంగా ఉంది. మ్యూజిషియన్స్ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. అందరూ ఒకే ఒక్క గొంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ గొంతు మరెవరిదో కాదు, లెజెండరీ సింగర్ కే.జే. యేసుదాస్ది. కానీ సమయం గడుస్తున్నా, యేసుదాస్ రాలేదు.
24
Image Credit : Social Media
యేసుదాసుని కాదని తానే స్వయంగా పాట పాడిన ఇళయరాజా
`సమయం వృథా అవుతోంది, ఒక ట్రయల్ చూద్దాం` అని ఇళయరాజా నిర్ణయించుకున్నారు. ఆయనే స్వయంగా ఆ పాట పాడి రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎమెర్జెన్సీ వల్ల తాను రాలేకపోయినందుకు యేసుదాస్ విచారం వ్యక్తం చేశారు. మరుసటి రోజు స్టూడియోకి వచ్చిన యేసుదాస్కు, ఇళయరాజా తాను పాడిన ట్రయల్ రికార్డింగ్ను ఇచ్చారు. `ఒకసారి విని సిద్ధంగా ఉండండి` అని చెప్పి వెళ్లారు ఇళయరాజా.
34
Image Credit : KJ Yesudas/ Facebook
ఇళయరాజాకి నో చెప్పిన యేసుదాసు
పాట పూర్తిగా విన్న యేసుదాస్ కళ్లు చెమర్చాయి. ఆయన నేరుగా ఇళయరాజా దగ్గరకు వెళ్లి, `ఈ పాటను పాడటానికి నా మనసు రావడం లేదు. ఈ ఫీల్, ఈ డెప్త్ నేను ఇవ్వగలనో లేదో తెలియడం లేదు. ఈ పాట ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోవాలంటే, అది మీ గొంతుతోనే సాధ్యం` అని చెప్పారు. ఇళయరాజా ఎంత బ్రతిమాలినా, ఆ పాట పాడటానికి యేసుదాస్ అంగీకరించలేదు.
44
Image Credit : our own
మాస్టర్ పీస్గా నిలిచిన సాంగ్ ఇదే
అంతటి గొప్ప గాయకుడైనప్పటికీ, ఒక పాట సరైన గొంతుతో జీవించాలని యేసుదాస్ తనకు వచ్చిన అవకాశాన్ని ఇళయరాజాకు వదిలేశారు. ఆ రోజు ఇళయరాజా గొంతులోంచి ప్రపంచానికి పరిచయమైన ఆ పాటే... "జననీ జననీ జగం నీ, అగం నీ”. ఈ పాట 1982లో వచ్చిన 'తాయ్ మూకాంబికై' చిత్రంలోనిది. ఈ పాటను ఈ రోజు కళ్లు మూసుకుని విన్నా మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అంత ఆత్మార్థంగా ఇళయరాజా ఆ పాటను పాడారు. అందుకే అది ఒక మాస్టర్పీస్గా నిలిచిపోయింది.
Latest Videos

