MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కన్నప్ప సరిగ్గా తీయలేదు, మోహన్ బాబు ముఖం మీదే చెప్పిన స్టార్ ప్రొడ్యూసర్

కన్నప్ప సరిగ్గా తీయలేదు, మోహన్ బాబు ముఖం మీదే చెప్పిన స్టార్ ప్రొడ్యూసర్

కన్నప్ప సినిమాపై తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నానన్నారు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. ఈ విషయం మోహన్ బాబుకు కూడా ఫోన్ చేసి చెప్పానన్నారు. కన్నప్ప సరిగ్గా తీసి ఉంటే బాగుండేది అన్నారు. 

3 Min read
Mahesh Jujjuri
Published : Jul 31 2025, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : x/manchu vishnu

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. మంచు మెహన్ బాబు నిర్మించిన ఈసినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కన్నప్ప సినిమాకోసం మంచు ఫ్యామిలీతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్, లాంటి మరికొందరు స్టార్స్ రంగంలోకి దిగారు. మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించిన ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

కానీ రిలీజ్ తరువాత అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది కన్నప్ప సినిమా. ఈక్రమంలో ఈసినిమాకు సబంధించి ట్రోల్స్, కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఈక్రమంలోనే స్టార్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమాపై చేసిన కామెంట్స్  సంచలనంగా మారాయి.

DID YOU
KNOW
?
అక్షయ్,కాజల్ పై తమ్మారెడ్డి కామెంట్స్
కన్నప్ప సినిమాలో శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ వెకిలిగా ఉన్నారని నిర్మాత తమ్మారెడ్డి అన్నారు . శివుడే సరిగ్గా ఉండకపోతే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన స్థానంలో ఒక అనామకుడిని పెట్టినా బాగుండేది. శివపార్వతులుగా వాళ్లిద్దరిని తీసుకోవడం వల్ల పెట్టిన ప్రతి రూపాయి నష్టమే అని అన్నారు.
25
Image Credit : facebook / Tammareddy Bharadwaj,

కన్నప్పపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

‘’ఈ సినిమా సరిగ్గా తీసి ఉంటే బాగుండేది, అసలు కన్నప్ప కోసం అంత మంది స్టార్స్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు, మామూలుగా తీసినా కూడా ఈసినిమా హిట్ అయ్యాయేది. కాని ఇంత మంది స్టార్స్ నటించడం వల్ల అంచనాలు పెరిగిపోయి.. వాటిని ఈసినిమా  అందుకోలేకపోయింది. భక్తి  సినిమాను వార్ మూవీగా తీస్తే ఎలా నడుస్తుంది, గతంలో ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి, అవన్నీ హిట్ అయినప్పుడు ఈసినిమా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయింది ‘’ అని  తమ్మారెడ్డి అన్నారు. ఆయన కమెంట్స్ పై రకరకాల అభిప్రాయాలు వెల్లడికాగా తాజాగా మరోసారి ఆ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు స్టార్ ప్రొడ్యూసర్.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకునే సీన్, భయంతో వణికిపోయిన మరో హీరో,పవర్ స్టార్ ఏమన్నారంటే?
Related image2
వెంకటేష్ జోడీగా ఐశ్వర్య రాయ్, క్రేజీ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏది?
35
Image Credit : facebook / Tammareddy Bharadwaj,

తన మాటలను సమర్ధించుకున్న తమ్మారెడ్డి

మంచు విష్ణు హీరోగా నటించిన మైథలాజికల్ మూవీ 'కన్నప్ప.' దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో, భారీ కాస్టింగ్ తో, పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించిన ఈసినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఈక్రమంలో ఈ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించిన నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చకు దారి తీస్తున్నాయి.

ఈ సినిమాపై తాను చేసిన విమర్శలపై వస్తున్న ప్రతిస్పందనలకు తాజాగా ఆయన సమాధానమిచ్చారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలు సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించాయి అనే కామెంట్స్ కు ఆయన క్లారిటీ ఇచ్చారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ – “కన్నప్ప సినిమాను నేను ఎనిమిదో రోజున చూసాను. దాని గురించి తొమ్మిదో రోజున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను. పదవ రోజున ఆ సినిమా చూసిన వారందరికీ నేను చెప్పిన విషయాలు తెలిసే ఉంటాయి. అంత గ్యాప్ తర్వాత మాట్లాడటం వల్ల ఏ నష్టం జరుగుతుంది? అప్పటికే ఆ సినిమా కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి, ఇక నావల్ల ఈసినిమాకు జరిగే నష్టం ఏముంటుంది.” అని ఆయన ప్రశ్నించారు.

45
Image Credit : facebook / Tammareddy Bharadwaj , Mohan Babu

మోహన్ బాబు కు ఫోన్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ

ఈ వ్యాఖ్యల విషయంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో నేరుగా మాట్లాడిన విషయాన్ని తమ్మారెడ్డి వెల్లడించారు. “కన్నప్ప సినిమా సూపర్ హిట్ అయ్యేది. కాని మీరే ఆ సినిమాను యావరేజ్ సినిమాగా మార్చారనే మాట నేరుగా మోహన్ బాబుగారికీ, విష్ణుకీ చెప్పాను. పెద్ద స్టార్‌ కాస్ట్ లేకున్నా, సరైన దిశలో తీసుంటే సినిమా నడిచేది. ఈ విషయాన్ని మోహన్ బాబుకు నేనే ఫోన్ చేసి నేరుగా చెప్పాను. మోహన్ బాబుగారికి డైరెక్షన్‌పై మంచి పట్టు ఉంది. మీరు పట్టించుకుని ఉంటే ఈ సినిమా ఇలా ఉండేది కాదు అని చెప్పాను'' అని భరద్వాజ్ అన్నారు.

55
Image Credit : Instagram

వాళ్లిద్దరిని తీసుకోవడం వల్ల భారీ నష్టం

ఇక కన్నప్ప సినమాపై మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు తమ్మారెడ్డి. ఈసినిమాలో శివపార్వతుల పాత్రలలో నటించిన అక్షయ్ కుమార్ , కాజల్ అగర్వాల్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వాళ్లు శివపార్వతులుగా వెకిలిగా ఉన్నారు. శివుడే సరిగ్గా ఉండకపోతే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన స్థానంలో ఒక అనామకుడిని పెట్టినా బాగుండేది. శివపార్వతులుగా వాళ్లిద్దరిని తీసుకోవడం వల్ల పెట్టిన ప్రతి రూపాయి నష్టమే” అని అన్నారు.

“మనవాళ్లు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పకపోతే ఎలా? అలా చెప్పకపోతే ఇలానే మరో సినిమా తీస్తారు. అప్పుడు నష్టపోతారు కదా'' అంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మంచు మోహన్ బాబు
ప్రభాస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved