సైరా సక్సెస్ మీట్ లో చిరు, రాంచరణ్, తమన్నా(ఫొటోస్)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎమోషన్, యాక్షన్ మిక్స్ చేసి అద్భుతంగా తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవి తన పెర్ఫామెన్స్ తో ఈ చిత్రానికి మరో స్థాయికి తీసుకుని వెళ్లారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర యూనిట్ నేడు సక్సెస్ మీట్ నిర్వహించింది.
రేసుగుర్రం, కిక్ చిత్రాలతో సత్తా చాటిన సురేందర్ రెడ్డి సైరా చిత్రానికి దర్శకుడు. ధృవ చిత్రంలో సురేందర్ రెడ్డి పనితనం నచ్చడంతో రాంచరణ్ సైరా చిత్ర బాధ్యతలని సురేందర్ రెడ్డికి అప్పగించారు.
తమన్నా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
తమన్నా పెర్ఫామెన్స్ కు ప్రశంసలు లభిస్తున్నాయి.
రాంచరణ్ నిర్మాతగా సైరా చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించాడు.
సైరా చిత్రం మెగాస్టార్ చిరంజీవి కలల పోజెక్టు. నరసింహారెడ్డి పాత్రలో చిరు నటన అద్భుతంగా ఉన్నట్లు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది.
చరిత్ర మరచిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి జీవించారు.
ఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ ఈ చిత్రంలో కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాల్లో నటించారు.
తమన్నా తన నటనతో సైరా చిత్రంలో ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది.
తమన్నా ముందు నుంచి సైరా ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది.
రాంచరణ్ ఖైదీ నెం 150 తర్వాత వరుసగా రెండవసారి తన తండ్రి చిత్రాన్ని నిర్మించాడు.
సైరా చిత్ర కథకు మూలకారకులు పరుచూరి బ్రదర్స్.
సైరా చిత్రాన్ని హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసారు.
జగపతి బాబు ఈ చిత్రంలో వీరారెడ్డిగా కీలక పాత్ర పోషించారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి.
సైరా చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లు దక్కుతున్నాయి.