Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన
సీనియర్ నటి సురేఖా వాణి ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. త్వరలో అమ్మకి రెండో పెళ్లి చేయబోతున్నట్టు తెలిపింది కూతురు సుప్రీత. కానీ ప్రస్తుతం ఆమె సినిమా ఆఫర్లు లేక ఖాళీగానే ఉంటుందట.

ఆఫర్స్ లేక ఖాళీ సురేఖా వాణి
సీనియర్ నటి సురేఖా వాణి ప్రస్తుతం సినిమా ఛాన్స్ లు లేక ఖాళీగానే ఉంటుంది. ఆ మధ్య ఒకటి అర చిత్రాల్లో మెరిసిన ఆమె ఇప్పుడు కనిపించడమే లేదు. ఈ విషయాన్ని ఆమె కూతురు సుప్రీతనే తెలిపింది. అమ్మకి ఇప్పుడు సినిమా అవకాశాలు రావడం లేదని, ఏడాదిన్నరగా మేకప్ వేసుకోలేదని, ఒక్క ఛాన్స్ కూడా లేదని తెలిపింది. అమ్మ పరిస్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
సురేఖా వాణి రెండో పెళ్లి
ఈ క్రమంలో అమ్మ సురేఖా వాణికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకుంది సుప్రీత. తన తల్లికి రెండో పెళ్లి చేయాలనుకుంటుందట. 2019లోనే సురేఖా వాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత నుంచి ఆమె ఒంటరిగానే ఉంది. మరో పెళ్లి చేసుకోలేదు. కూతురు కెరీర్ని సెట్ చేసే పనిలో ఉంది. అదే సమయంలో ఎంతో మనో వేదన అనుభవించింది. ఫ్యామిలీ వారి నుంచే విమర్శలను ఎదుర్కొంది. కొంత ట్రోల్స్ కి గురయ్యింది సురేఖా వాణి.
అమ్మకి మరో లైఫ్ ఇవ్వాలని కూతురు ప్లాన్
భర్త మరణంతో సురేఖా వాణి చాలా డౌన్ అయిపోయింది. మరోవైపు సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. దీంతో కూతురే ప్రపంచంగా బతికేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు సురేఖా వాణికి పెళ్లి చేయాలనుకుంటుంది సుప్రీత. అమ్మకి రెండో పెళ్లి చేయాలని అనుకుంటుందట. ఈ విషయాన్ని ఆమెతో చెప్పగా, తాను నాన్నతోనే ఆగిపోవాలని, మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని తెలిపిందట.
తన మ్యారేజ్కి ముదే అమ్మకి పెళ్లి చేస్తా
అయితే తాను మ్యారేజ్ చేసుకునే ముందు అయినా అమ్మకి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుందట. ఇప్పుడు అదే పనిలో ఉందట. సరైన వ్యక్తి దొరకాలని, అమ్మని బాగా చూసుకోవాలని, ఆమెకి అండగా నిలబడాలి, ఆమెకి ఫ్రీడమ్ ని ఇచ్చే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి కోసం చూస్తున్నట్టు తెలిపింది సుప్రీత. అమ్మ ఇప్పుడు మ్యారేజ్ కి రెడీగా లేదని, కానీ తాను పెళ్లి చేసుకునే ముందు అయినా ఆమెకి రెండో మ్యారేజ్ చేస్తానని తెలిపింది. ఈ విషయంలో అమ్మ తరఫున మామయ్యతో కూడా మాట్లాడిందని, వాళ్లు కూడా ఓకే చెప్పినట్టు వెల్లడించింది సుప్రీత.
సుప్రీత డెబ్యూ మూవీ `అమరావతికి ఆహ్వానం`
సురేఖా వాణి కూతురు సుప్రీత నటిగా ఎంట్రీ ఇస్తూ `అమరావతికి ఆహ్వానం` అనే చిత్రంలో నటించారు. శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రీత ప్రధాన పాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వం వహించారు. కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఇటీవల ట్రైలర్ని విడుదల చేయగా ఆకట్టుకుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే సుప్రీత ఈ వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి సురేఖా వాణికి రెండో పెళ్లి చేయబోతుందని చెప్పొచ్చు.

